ఈనెల నాలుగో తారీఖు ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల కార్పొరేషన్ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.ఈ ఎన్నికలకు సంబంధించి ఓట్ల కౌంటింగ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది.
మొత్తం 250 వార్డులకు జరిగిన ఈ కార్పొరేషన్ ఎన్నికలలో.ఎవరు గెలుస్తారు అన్నది చాలా ఉత్కంఠ భరితంగా నెలకొంది.
దాదాపు 15 సంవత్సరాలుగా అధికారంలో కొనసాగుతున్న బీజేపీని ఆమ్ ఆద్మీ పార్టీ క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి.
పరిస్థితి ఇలా ఉంటే కౌంటింగ్ ప్రారంభమైన గంటన్నరకే బీజేపీ 78 వార్డుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కంటే ముందంజలో ఉంది.
ఆమ్ ఆద్మీ పార్టీ 42 స్థానాలలో లీడులో కొనసాగుతుంది.కాంగ్రెస్ పార్టీ కేవలం నాలుగు స్థానాలు ఆధిక్యం ప్రదర్శించడం జరిగింది.
మొత్తం ఎన్నికల ఫలితాలు ఈరోజు మధ్యాహ్నంకి తెలియనున్నాయి.కౌంటింగ్ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు.