తెలంగాణ బీజేపీలో టికెట్ల రగడ ! ఆఫీసుపై దాడి ఫర్నిచర్ ధ్వంసం
భారతీయ జనతా పార్టీ… తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం తాజాగా ప్రకటించిన రెండో జాబితా ఆ పార్టీ చిచ్చుపెట్టింది.నిజామాబాద్ అర్బన్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణను బరిలోకి దింపింది బీజేపీ.
దీంతో నిజామాబాద్ బీజేపీ లో అసమ్మతి బయటపడింది.లక్ష్మీ నారాయణకు టికెట్ కేటాయింపుతో ఆగ్రహానికి గురైన ధన్పాల్ వర్గం… బీజేపీ కార్యాలయంపై దాడి చేసింది.
ఆఫీసులో ఫర్నీచర్ ధ్వంసం చేసింది.మరోవైపు త్వరలోనే బీజేపీకి రాజీనామా చేసే యోచనలో ధన్పాల్ ఉన్నారనే ప్రచారం సాగుతోంది… అవసరమైతే స్వతంత్రంగా పోటీ చేయాలనే యోచనలో ఉన్నారని తెలుస్తోంది.
బీజేపీ అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ అమ్ముపోయాడని ధన్పాల్ వర్గం ఆరోపిస్తోంది.
అలాగే… శేరిలింగపల్లి టిక్కెట్ ఆశించిన డాక్టర్ నరేష్, కసిరెడ్డి భాస్కర్ రెడ్డిలు తమకు టిక్కెట్ దక్కక పోవడంతో నిరసనకు దిగారు.బీజేపీ కార్యాలయం వద్ద ఇద్దరూ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు.వాళ్ల వర్గీయులైతే ఏకంగా కార్యాలయం బిల్డింగ్ పైకెక్కి దూకుతామని హెచ్చరించారు.
శేరిలింగం పల్లి బీజేపీ అభ్యర్థిగా యోగానంద్ పేరు అదిష్టానం ఖరారు చేయడంతో, టిక్కెట్లను అమ్ముకున్నారంటూ నరేష్ వర్గీయులులు నినాదాలు చేశారు.శేరిలింగంపల్లి అభ్యర్థి యోగానంద్ దిష్టిబొమ్మను నరేష్ వర్గీయులు దగ్ధం చేశారు.