ట్విట్టర్ కు మరో షాక్ తగిలంది.ట్విట్టర్ కో ఫౌండర్ బిజ్ స్టోన్ కూడా ట్విట్టర్ కు గుడ్ బై చెప్పేశాడు.2006లో జాక్ డోర్సే, నోహా గ్లాస్, ఇవాన్ విలియమ్స్, బిజ్ స్టోన్ లు కలిసి ట్విట్టర్ ను స్థాపించారు.ప్రపంచమంతా ఇప్పుడు ట్విట్టర్ ను ఒక మంచి మాధ్యమంగా వాడుతున్నారు.
అయితే ఎలన్ మస్క్ ట్విట్టర్ ను 44 బిలియన్ డాలర్స్ తో కొనేసిన విషయం తెలిసిందే.ఎలన్ మస్క్ కొన్న దగ్గర నుంచి ట్విట్టర్ లో ఏదో ఒక మార్పు జరుగుతూనే వస్తుంది.
లేటెస్ట్ గా ట్విట్టర్ ఫౌండర్స్ లో ఒకరైన బిజ్ స్టోన్ కూడా ట్విట్టర్ ను వదిలి బయటకు వచ్చారు.ట్విట్టర్ నుంచి ఎగ్జిట్ అయ్యి మాస్టోడన్ అనే దానిలో జాయిన్ అయినట్టు తెలుస్తుంది.
ఎలన్ మస్క్ తీసుకున్నప్పటి నుంచి ట్విట్టర్ ఫైల్స్ పేరుతో అక్కడ జరుగుతున్న విషయాలను బయట పెట్టిన బిజ్ స్టోన్ ఫైనల్ గా ట్విట్టర్ ని వదిలి పెట్టారు.బిజ్ నిర్ణయాన్ని మరో కో ఫౌండర్ అయిన ఇవాన్ విలియమ్స్ కూడా సమర్ధించారు.
మరి ట్విట్టర్ ను ఎలన్ మస్క్ ఏం చేద్దామని అనుకున్నాడో కానీ ఆ సంస్థలో ఉన్న పెద్ద తలకాయలన్ని ఇలా ఒక్కొక్కరుగా బయటకు వెళ్తున్నారు.