పంచాయతీ ఎన్నికలలో హిందూపురం నియోజకవర్గంలో అత్యధిక స్థానాలు వైసీపీ గెలవడంతో మున్సిపల్ ఎన్నికల్లో పట్టు నిలుపుకోవడానికి బాలకృష్ణ రెడీ అయ్యారు.ఈ నేపథ్యంలో ఉదయం నియోజకవర్గం లో ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు పూజలు నిర్వహించి మీడియాతో మాట్లాడిన బాలయ్య అధికార పార్టీ వైసీపీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి జరగడం లేదని ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది అంటూ పేర్కొన్నారు.ఆతర్వాత ప్రచారంలో పాల్గొన్న బాలయ్యకు నియోజకవర్గంలో చేదు అనుభవం ఎదురైనట్లు ఏపీ మీడియాలో వార్తలు వస్తున్నాయి.మేటర్ లోకి వెళ్తే బాలయ్యబాబు రోడ్ షోలకు కనీసం జనాలు కూడా రావడం లేదని, దీంతో పక్కనే ఉన్న కార్యకర్తలతో మరియు కేడర్ తో బాలయ్య అసహనం చెందినట్లు పార్టీలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
.