తెలుగు బుల్లి తెరపై బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవి వేసిన ముద్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.వీ6 తీన్మార్ వార్తల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన బిత్తిరి సత్తి సుదీర్ఘ కాలం పాటు అక్కడ చేసిన సత్తి ఆ తర్వాత టీవీ9 ఇస్మార్ట్ న్యూస్కు షిఫ్ట్ అయ్యాడు.అక్కడ ఏడాది పాటు సక్సెస్ ఫుల్గా జర్నీ సాగించిన తర్వాత కొన్ని కారణాల వల్ల అందులోనుండి తప్పుకున్న విషయం తెల్సిందే.ఇప్పుడు సాక్షి టీవీలో ఆయన కొత్త జర్నీ ప్రారంభం అయ్యింది.
వారం రోజుల క్రితం సత్తి సాక్షి టీవీలో ‘గరం గరం వార్తలు’ అనే షోతో షురూ చేశాడు.యాంకర్గా తన చిన్నాయిన బిడ్డను దించిన సత్తి షోలో టిక్టాక్ దివ్యను కూడా చూపించడంతో అంతా కూడా అంచనాలు పెంచుకున్నారు.
అయితే తీన్మార్ న్యూస్ మరియు ఇస్మార్ట్ న్యూస్తో పోల్చితే గరం గరం వార్తలకు పెద్దగా ఆధరణ కనిపించడం లేదు. సాక్షి టీవీకి తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా టీఆర్పీ రేటింగ్ లేదు.
ముఖ్యంగా తెలంగాణలో ఛానెల్ పరిస్థితి సాదా సీదాగా ఉంది.
ఇలాంటి పరిస్థితుల్లో గరం గరం వార్తలతో ఖచ్చితంగా మంచి రేటింగ్ వస్తుందని అంతా భావించారు.కాని ఇప్పటి వరకు షోకు సంబంధించిన టాక్ జనాల్లో స్ప్రెడ్ అవ్వడం లేదు.గరం గరం వార్తలకు సంబంధించిన ప్రచారంను కేవలం సాక్షిలో మాత్రమే చేశారు.
కనుక ప్రేక్షకులకు అది అంతగా ఎక్కడం లేదేమో అనిపిస్తుంది.యూట్యూబ్లో మిలియన్ల కొద్ది వ్యూస్ వచ్చే సత్తి స్కిట్స్కు లక్షల్లో మాత్రమే వ్యూస్ వస్తున్నాయి.
ఇంకొన్ని రోజులు అయితే ఫామ్లోకి వస్తాడో లేదంటే ఇదే పరిస్థితి కొనసాగుతుందో చూడాలి.