తెలుగు బుల్లి తెరపై బిత్తిరి సత్తి సెన్షేషన్ క్రియేట్ చేశాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఎందుకంటే ఆయన ఒక్క న్యూస్ షో తో దుమ్ము రేపాడు.
అద్బుతమైన తెలంగాణ యాసతో పాటు మంచి టైమింగ్తో స్టార్స్ను సైతం అభిమానులుగా మార్చేసుకున్నాడు.ఇలాంటి బిత్తిరి సత్తి వీ6 నుండి సుదీర్ఘ ప్రయాణం తర్వాత టీవీ9లో జాయిన్ అయ్యాడు.
కొన్ని అనివార్య కారణాల వల్ల టీవీ9 నుండి తక్కువ సమయంలోనే బయట పడాల్సి వచ్చింది.తాజాగా సాక్షిలో జాయిన్ అయినట్లుగా అధికారికంగా ప్రకటించిన బిత్తిరి సత్తి నిన్నటి నుండి అక్కడ గరంగరం వార్తలను మొదలు పెట్టాడు.
నిన్న ప్రారంభం అయిన మొదటి ఎపిసోడ్ను తనికెళ్ల భరణి పరిచయం చేశారు.యాంకర్ మరియు న్యూస్ రిపోర్టర్ ఇంకా సత్తి పాత్రలను తనికెళ్ల భరణి పరిచయం చేయడం జరిగింది.
మొదటి ఎపిసోడ్కు మంచి రెస్పాన్స్ వచ్చింది.యాంకర్గా తన బాబాయి కూతురునే రంగంలోకి దించిన బిత్తిరి సత్తి ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా టిక్ టాక్ దివ్యను తీసుకు వచ్చాడు.
దివ్య ఇప్పటికే సోషల్ మీడియాలో ఏ స్థాయి ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
కన్నడకు చెందిన ఆ అమ్మాయి తెలుగును విభిన్నంగా మాట్లాడుతుంది.అందుకే ఖచ్చితంగా కామెడీ అవుతుందనే ఉద్దేశ్యంతో సత్తి టీం ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.టీవీ9 లో ఇస్మార్ట్ న్యూస్ను డామినేట్ చేసే టార్గెట్గా గరం గరం వార్తలు రెడీ అయ్యాయి.నేటి నుండి ప్రతి రోజు రాత్రి 8.30 నిమిషాలకు ప్రసారం కానున్నాయి.తీన్మార్ మరియు ఇస్మార్ట్ న్యూస్లు 9.30 కి ప్రసారం కానుండగా వాటితో పోటీ వద్దనుకుని గరం గరం వార్తలను గంట ముందే ప్రసారం చేయబోతున్నారు.ఇప్పటి వరకు సాక్షి రేటింగ్ ఆశించిన స్థాయిలో లేదు.మరి ఈ షోతో అయినా సాక్షి రేటింగ్ పైకి వెళ్తుందా అనేది చూడాలి.