ప్రకృతితో ఆట, ప్రకృతి తో మమకేం అయ్యి జీవించే జంతువులతో చెలగాటం అంత మంచిది కాదు.వాటి లైఫ్ స్టైల్ కి ఏ మాత్రం ఆటంకం కలిగించినా సరే అవి భయానక వాతావరం సృష్టిస్తాయి.
ఇలాంటి సంఘటనే ఇప్పుడు అమెరికాలోని ‘ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ లో చోటు చేసుకుంది.ఫ్లోరిడా లోని ఓ ప్రాంతానికి చెందిన సుమారు 50 మంది పర్యాటకులు నేషనల్ పార్క్ లో సంచరిస్తూ అమెరికా అడవి దున్నగా పిలిచే బైసన్ గుంపు వద్దకి వెళ్ళారు.
సుమారు అరగంట పాటు అక్కడే ఉన్నారు.వారిలో ముగ్గురు పిల్లలు వాటిని కవ్విస్తూ, ఆటపట్టిస్తున్న సమయంలో ఒక్క సారిగా ఆ ముగ్గురు పిల్లలపైకి మగ దున్న దూసుకు వెళ్ళింది.
అప్పటికే వారిలో ఇద్దరు దాని బారినుంచీ తప్పించుకోగా ఒక బాలిక మాత్రం బైసన్ కి దొరికిపోయింది.ఒక్క సారిగా దాని కొమ్ములతో బాలికని అమాంతం పైకి ఎగరేసింది.
దాంతో ఎవరికి వారు అక్కడి నుంచీ పారిపోయారు.
ఈ సంఘటన నుంచీ కోలుకున్న కుటుంభ సభ్యులు బాలికని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.ఇదిలాఉంటే ఈ సంఘటనపై కుటుంభ సభ్యులు ఎవరూ కూడా పార్క్ సిబ్బందికి ఫిర్యాదు చేయలేదు.అయినప్పటికీ ఈ సంఘటనపై వచ్చిన వీడియో ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
అయితే పార్క్ లోకి వచ్చే వాళ్ళు వాటి విషయంలో జాగ్రత్త వహించాలని, ఎటువంటి కవ్వింపు చర్యలకి పాల్పడినా వాటి ఎదురు దాడి నుంచీ తప్పించుకునే అవకాశం ఉందని హెచ్చరించారు.