బిర్యాని మాట వినగానే చిన్నా పెద్ద నుంచి అందరికీ కూడా నోరూరుతుంది.అలాంటి బిర్యాని ఐదు పైసల కే దొరుకుతుంది అంటే ఎవరైనా వూరికే ఊరుకుంటారా.
మీరు వింటుంది నిజమే, ఐదు పైసల కే బిర్యానీ ఏంటి అని అనుకుంటున్నారా.నిజమే తమిళనాడులో ఇలాంటి ఆఫర్ ప్రకటించాడు ఒక వ్యక్తి.
ఇక ఐదుపైసలకే బిర్యాని లభిస్తుంది అంటే ఊరుకుంటారా అంతే తెల్లారేసరికి అక్కడ ఒక పెద్ద క్యూ ఏర్పడింది.
తమిళనాడు లోని దిండుక్కల్ బస్టాండ్ సమీపంలోని ముజిఫ్ బిర్యానీ సెంటర్ లో 5 పైసల కె ఒకటిన్నర ప్లేట్ బిర్యానీ అందిస్తామని ప్రకటించడం తో ఆ వార్త కాస్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.దీనితో ఆ ఐదు పైసల బిర్యానీ సెంటర్ముందు బుధవారం ఉదయం నుంచే క్యూ కట్టి నిలుచున్నారు.అసలు ఐదు పైసలు చలామణి లో కూడా అలాంటిది కేవలం ఐదు పైసలకి ప్లేటున్నర బిర్యానీ ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా.
అక్కడే ఒక చిన్న మెలిక ఉంది.కేవలం 5 పైసల నాణెంపైనే ఈ బిర్యానీ అందజేస్తారు.
అయితే భవిష్యత్ తరాలకు మనం ఉపయోగించిన వస్తువులు, నాణేలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే బిర్యానీపై 5 పైసల ఆఫర్ పెట్టామని ఇలా 5 పైసల నాణేలు సేకరించామని ఆ బిర్యానీ సెంటర్ యజమాని తెలిపారు.నిజంగా వినూత్నమైన ఆలోచనతో ఆ బిర్యానీ సెంటర్ యజమాని చేసిన దానికి అందరూ అభినందిస్తున్నారు.