సినీ ఇండస్ట్రీలో ఉన్న నటీనటులు తాము సినిమాల్లోకి రాకముందుకు ఎన్నో రంగాలలో పని చేసిన వాళ్ళే ఉంటారు.వాళ్లు తమ సినీ జీవితాన్ని ప్రారంభించక ముందు తమ అవసరాల కోసం ఏదో ఒక ఉద్యోగం లేదా వ్యాపారాలు చేసేవాళ్లు.
ఇలా ప్రతి ఒక్క సినీ నటులు తమ పాకెట్ మనీ కోసం పార్ట్ టైం జాబ్ చేసిన వాళ్ళు ఉండగా.అందులో టాలీవుడ్ హీరోయిన్ లే కాకుండా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కూడా ఉండగా.
ఆమె ఓ కేఫ్ లో పని చేసిందట.ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.
హిందీలో ఆశిక్ 2 సినిమా ద్వారా తన నటనతో మరింత గుర్తింపు సొంతం చేసుకున్న బ్యూటీ శ్రద్ధా కపూర్.ఆమె తన అందంతో, నటనతో మంచి గుర్తింపు పొందిన తర్వాత వరుస సినిమాలలో ఆఫర్ లను సొంతం చేసుకుంది.
అంతేకాకుండా టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ తో కూడా సాహో సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.ఇక ఆమె ఒక స్టార్ ఫ్యామిలీ లో పుట్టి కూడా ఓ కేఫ్ లో పని చేసిందంటే చాలా గొప్ప విషయమని అర్థమవుతుంది.
ఈ రోజు తన పుట్టిన రోజు సందర్భంగా తన నటనా జీవితం గురించి పలు సందర్భాలలో కొన్ని విషయాలు పంచుకుంది.ఆమె నటిగా ఎప్పుడు రాణించాలనుకోలేదట.తాను కేవలం ఓ సైకాలజిస్ట్ అవ్వాలనుకుందట.అందుకు ఆ చదువుల కోసం బోస్టన్ విశ్వవిద్యాలయం లో చేరిందట.అక్కడ ఆమె చదువుకునే రోజుల్లో తన పాకెట్ మనీ కోసం ఓ కేఫ్ లో పార్ట్ టైం జాబ్ చేసిందట.అతి తక్కువ మొత్తంతో సంపాదించినప్పటికీ తనకు ఎంతో గర్వంగా అనిపించేదని.
అంతేకాకుండా పార్ట్ టైం జాబ్ చేసి సంపాదించిన రోజుల్లో పొందిన ఫీలింగ్ ఇప్పుడు సినిమాల్లో చేస్తున్న రాలేదంటు తెలిపింది.