ప్రస్తుతం అక్కినేని అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో అక్కినేని అఖిల్ సరసన హీరోయిన్ పూజ హెగ్డే నటిస్తోంది.
అక్కినేని అఖిల్ సినిమా కెరియర్ లో నాలుగో సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు, వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.కాకపోతే ఈ సినిమా కంప్లీట్ రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సినిమా తెరకెక్కబోతుంది.
ఇక తెర మీద పూజా హెగ్డే, అఖిల్ అక్కినేని రొమాన్స్ కుర్రకారును బాగా ఆకట్టుకుంటుందని యూనిట్ సభ్యులు చాలా నమ్మకంగా ఉన్నారు.
ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి రెండు పోస్టర్స్ రిలీజ్ చేయగా అవి ప్రేక్షకుల్లో బాగా అంచనాలను పెంచేసాయి.
ఇకపోతే తాజాగా పూజా హెగ్డే పుట్టిన రోజును పురస్కరించుకొని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలోని ఓ లుక్ ను సినీ బృందం మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ పూజ హెగ్డే లుక్ ను రిలీజ్ చేసి విషెస్ తెలిపింది.ఈ పోస్టర్ లో పూజ హెగ్డే నిజంగా మిరుమిట్లు గొలుపుతోంది.
ఈ పోస్టర్ బాగా కుర్రకారుని ఆకట్టుకుంటోంది.ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చాలా వరకు పూర్తయినట్లు సమాచారం.
అన్ని పరిస్థితులు అనుకూలిస్తే ఈ సినిమా వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇక ప్రస్తుతం పూజ హెగ్డే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో మాత్రమే కాకుండా హీరో ప్రభాస్ సరసన రాధే శ్యామ్ సినిమాలో కూడా నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.
అంతేకాదండోయ్.ఈ భామ మరో రెండు బాలీవుడ్ సినిమాలను కూడా చేతిలో పట్టుకుంది.ఇక ప్రస్తుతం రాధే శ్యామ్ సినిమా షూటింగ్ కోసం ఈవిడ యూరప్ లో షూటింగ్స్ కు హాజరవుతోంది
.