మనిషి మనస్సుకు ప్రకృతిని మించిన స్నేహితుడు లేదంటారు.ఎందుకంటే ఈ ప్రకృతిలో దాగున్న అందాలు బహుశా ఏ లోకంలో కనిపించవు కావచ్చూ.
ఆరాధించే కనులు ఉండాలే గానీ ప్రకృతిలో కనిపించే ప్రతి దృశ్యం ఒక అందమైన కాన్వాస్ అవుతుంది.
అందుకే ప్రకృతి ప్రేమికులకు ప్రకృతి ఆరాధాన స్వర్గంతో సమానం.
ఇకపోతే అందమైన ఓ బుల్లిపిట్ట చేసిన పనికి కొంచెం అయితే ప్రమాదంలో పడేదట.ఇండోనేసియాకు చెందిన బుడీ గునావాన్ తీసిన ఈ ఫోటోను గమనిస్తే అందులో ఒక పామును ఈ పిట్ట ముద్దాడుతున్నట్లుగా కనిపిస్తుంది.
ఈ దృశ్యాన్ని చూసిన వారికి పిట్టకు ముద్దెట్టుకోవడానికి పాము దోరికిందా అనే ఆలోచన రాక మానదు.కానీ ఈ చిత్రం నిజం కాదు.అచ్చం మనం ఆలోచిస్తున్నట్టే ఉన్న ఈ చిత్రం గురించి తెలుసుకుంటే.ఆ పక్షి పేరు సన్బర్డ్.
ఇవి పువ్వుల నుంచి మకరందాన్ని తాగుతుంటాయి.
అందుకే పచ్చగా కనిపిస్తే పువ్వు అనుకుందో ఏమోగానీ, ఇలా పాముకు దగ్గరగా వెళ్లింది.
అయితే, ఈ పిట్ట సర్పానికి అతి సమీపానికి వెళ్లినా ముద్దాడలేదట.తాను తీసిన ఫొటో యాంగిల్ వల్ల ఆ ఎఫెక్ట్ వచ్చిందని ఈ చిత్రాన్ని క్లిక్మనిపించిన బుడీ గునావాన్ తెలుపుతున్నాడు.