బిపిన్ రావత్ మరణించినట్లు అధికారికంగా ధ్రువీకరించిన భారత వాయుసేన..!!

భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించినట్లు అధికారికంగా గా భారత వాయుసేన ప్రకటించింది.భారత త్రివిధ దళాల చరిత్రలోనే అత్యంత విషాదకర సంఘటన గా ఇది చోటు చేసుకుంది.

 Bipin Rawat Died In Choper Crash Said Indian Defence Force, Bipin Rawat, Tamil-TeluguStop.com

బిపిన్ రావత్ తో పాటుగా ఆయన భార్య మధులిక తో పాటు మరో పదిమంది సైనిక అధికారులు… హెలికాప్టర్ పైలెట్…కలిపి మొత్తం 13 మంది ఈ దుర్ఘటనలో మరణించడం జరిగింది.ప్రమాదం జరిగిన తర్వాత కొద్దిసేపు బిపిన్ రావత్ ప్రాణాలతో నే ఉన్నారని .దీంతో ఆయనను హాస్పిటల్ లో జాయిన్ చేసారని ప్రాణాలతో పోరాడుతూన్నట్లు చికిత్స తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి.

కానీ అసలు విషయం కొస్తే ప్రమాదం జరిగిన సమయంలో నే బిపిన్ రావత్ మరణించడం జరిగిందట.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ది గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ అని తాజాగా భారత డిఫెన్స్ క్లారిటీ ఇవ్వడం జరిగింది.బిపిన్ రావత్ భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఇండియా.

దీంతో ఆయన మరణంతో.భారత ఆర్మీ బలగాలలో విషాదం నెలకొంది.

ప్రారంభంలో ప్రమాదం జరిగిన సమయంలో బిపిన్ రావత్ బతికి ఉన్నట్లు వార్తలు రాగా దేశవ్యాప్తంగా చాలా మంది ఆయన కోలుకోవాలని… ప్రాణాపాయం లేకుండా సురక్షితంగా ఉండాలని భగవంతుని ప్రార్ధించారు కానీ చివరాకరికి మరణించడంతో.దేశవ్యాప్తంగా విషాదఛాయలు అలుముకున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube