భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించినట్లు అధికారికంగా గా భారత వాయుసేన ప్రకటించింది.భారత త్రివిధ దళాల చరిత్రలోనే అత్యంత విషాదకర సంఘటన గా ఇది చోటు చేసుకుంది.
బిపిన్ రావత్ తో పాటుగా ఆయన భార్య మధులిక తో పాటు మరో పదిమంది సైనిక అధికారులు… హెలికాప్టర్ పైలెట్…కలిపి మొత్తం 13 మంది ఈ దుర్ఘటనలో మరణించడం జరిగింది.ప్రమాదం జరిగిన తర్వాత కొద్దిసేపు బిపిన్ రావత్ ప్రాణాలతో నే ఉన్నారని .దీంతో ఆయనను హాస్పిటల్ లో జాయిన్ చేసారని ప్రాణాలతో పోరాడుతూన్నట్లు చికిత్స తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి.
కానీ అసలు విషయం కొస్తే ప్రమాదం జరిగిన సమయంలో నే బిపిన్ రావత్ మరణించడం జరిగిందట.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ది గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ అని తాజాగా భారత డిఫెన్స్ క్లారిటీ ఇవ్వడం జరిగింది.బిపిన్ రావత్ భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఇండియా.
దీంతో ఆయన మరణంతో.భారత ఆర్మీ బలగాలలో విషాదం నెలకొంది.
ప్రారంభంలో ప్రమాదం జరిగిన సమయంలో బిపిన్ రావత్ బతికి ఉన్నట్లు వార్తలు రాగా దేశవ్యాప్తంగా చాలా మంది ఆయన కోలుకోవాలని… ప్రాణాపాయం లేకుండా సురక్షితంగా ఉండాలని భగవంతుని ప్రార్ధించారు కానీ చివరాకరికి మరణించడంతో.దేశవ్యాప్తంగా విషాదఛాయలు అలుముకున్నాయి.