సాధారణంగా సినీ ఇండస్ట్రీలో సినిమా విడుదల అవుతుంది అంటే సినిమా ప్రమోషన్స్ కోసం పీఆర్ టీమ్ లను పెట్టుకుంటూ ఉంటారు అని అంటూ ఉంటారు.సినిమా లాంచ్ అయ్యేటప్పటి నుంచి సినిమా థియేటర్లలో విడుదల అయ్యేంతవరకూ ఆ సినిమా గురించి ఎక్కడ నెగిటివ్ టాక్ రాకుండా రిమోట్ చేయడం వీరి బాధ్యత.
అయితే ఇక సినిమాలకు నెగిటివ్ కాకుండా ప్రమోట్ చేయడం కోసం నిర్మాణ సంస్థల నుంచి ప్యాకేజీ లో మాట్లాడుకొని మరి ఆ సినిమాకు హైప్ తీసుకుని వస్తూ ఉంటారు ఈ పిఆర్ఓ లు.
డబ్బులు ఎంత ఎక్కువగా ముట్ట జరిగితే అంత ఎక్కువగా ప్రమోషన్స్ చేస్తారన్నమాట.అయితే ఈ పిఆర్ఓ వ్యవస్థ సినిమా నుంచి ఇప్పుడు బిగ్ బాస్ వరకు విస్తరిస్తోంది.ఇప్పుడు స్వయంగా సినిమా పిఆర్ఓ లు బిగ్ బాస్ షోకి పిఆర్ చేస్తూ ప్రమోషన్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ 2 లో కౌశల్ విన్నర్ కావడానికి ఈ పిఆర్ఓలే కారణం అంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.ఇక అప్పటి నుంచీ ప్రతి సీజన్ లో కూడా ఈ పిఆర్ఓ టీమ్ లు వస్తున్నాయి.
బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే ప్రతి ఒక కంటెస్టెంట్ పిఆర్ఓ టీంలను పెట్టుకొని మరి హౌస్ లోకి వెళ్తున్నారు.తాజాగా ముగిసిన బిగ్ బాస్ నాన్ స్టాప్ షోలోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ మిత్రా, బిందు, అఖిల్, అరియానా, శివ, హామీదా, స్రవంతి ఇలా చాలామంది పిఆర్ఓ టీమ్ లను పెట్టుకొని మరి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారట.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త గట్టిగా వినిపిస్తోంది.అదేమిటంటే బిందుమాధవి ఈ పిఆర్ఓ టీమ్ ల వల్లే టైటిల్ విన్నర్ గా నిలిచింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ వార్తల పై బిందుమాధవి తండ్రి స్పందిస్తూ నటరాజ్ మాస్టర్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
బిందుమాధవి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుని తప్ప పిఆర్ఓ టీమ్ లను పెట్టుకోలేదని, తనకు అవసరం కూడా లేదని, ఎందుకంటే ఫ్యామిలీ ఎపిసోడ్ కు వెళ్లినప్పుడు నాకు అర్థం అయిపోయిందని, బిందుమాధవి రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల హృదయాల్లో నిలిచి పోయిందని ఏపీ తెలంగాణతోపాటు కర్ణాటక చెన్నై ప్రాంతాల నుంచి కూడా చాలామంది బిందుమాధవి సపోర్ట్ చేశారు అంటూ కాస్త గట్టిగానే సమాధానం ఇచ్చాడు బిందుమాధవి తండ్రి.బిందు పిఆర్ఓ టీమ్ లను పెట్టుకొని ఓట్లు వేయించుకొంది అని నట్రాజ్ మాస్టర్ అంటున్నాడు మరి ఆయనకు ఎక్కడా అలా అనిపించింది ఏమో గాని అలాంటి వ్యక్తి ని పట్టించుకోకూడదు.అంతేకాకుండా ఎంత తక్కువగా ఆలోచిస్తే అంత మంచిది అని చెప్పుకొచ్చారు బిందుమాధవి తండ్రి.