ఇటీవల కాలంలో జరిగే కొన్ని ఘటనల వీడియోలు అందరిని షాక్ కి గురి చేస్తున్నాయి.ఒకో చోటా జరిగిన వీడియో కాస్త మరో జరిగిన చోటా జరిగినట్టు చెప్పి నానా రచ్చ చేస్తున్నారు.
ఇంకా అలానే ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.అది ఏంటంటే? భారీ వర్షాల కారణంగా రోడ్డు పక్కన ఉన్న బిల్బోర్డు అమాంతం ఊడిపడి వాహనదారులపై పడింది.
ఇంకా ఆ ప్రమాదం లో వేరు వేరు బైక్ పై వస్తున్న ఇద్దరు వాహదారులు తీవ్రంగా గాయపడ్డారు.ఇంకా ఈ ఘటన తాలూకు ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఆ ఘటన కాస్తా హైదరాబాద్ లో జరిగినట్టు భారీ స్థాయిలో ప్రచ్చరం జరుగుతుంది.ఈ భయంకర ఘటన హైదరాబాద్ లోని మెహదీపట్నంలో జరిగింది అని ఓ ఫేసుబుక్ యూజర్ పోస్ట్ చేశాడు.
దీంతో ఈ వీడియోను చుసిన నెటిజన్లు అంత ఓ రేంజ్ లో షేర్ చేశారు.అయితే నిజానికి ఈ ఘటన పాకిస్తాన్లోని కరాచీలో జరిగిందని సమాచారం.
ఈ ఘటన ఈ నెల 6వ తేదీన అక్కడ జరిగినట్టు ”ద ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్” వెల్లడించింది.ఆ తర్వాత ఆ నగరంలో ఉన్న బిల్బోర్డులు అన్ని తొలిగించినట్టు తెలిపారు.
అయితే ఆ ఘటన హైదరాబాద్ లో జరగలేదని తెలంగాణకు చెందిన ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కూడా ట్విట్ చేసారు.