పాట్నాలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన జన్ ఆక్రోస్ ర్యాలీ సందర్భంగా… బీహార్ ప్రతిపక్ష నాయకుడు… ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించాడు.అంతే కాదు….
‘‘బట్టతల ఉన్నవారికి 2014లో మోదీ దువ్వెనలు అమ్మారు.జుట్టు లేకున్నా మాకు దువ్వెలు ఎందుకని వారు అడిగితే.
నేను అధికారంలోకి రాగానే మీకు జుట్టు తెప్పిస్తా అని మోదీ చెప్పారు.మోదీ మంచి సేల్స్మెన్’’ అని తేజస్వీ ఎద్దేవా చేశారు.
కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి దేశంలో లేదని, మోదీని ఎవరు నమ్మరని అన్నారు.కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హాజరైన ఈ సభలో తేజస్వీ ఆయనతో పాటు వేదికను పంచుకున్నారు.మోదీ అసలు రంగును బిహార్ నిరుద్యోగులకు వివరించడానికి రాహుల్ ఇక్కడి రావడం సంతోషంగా ఉందన్నారు.
.తాజా వార్తలు