అమ్మాయి ప్రేమించలేదనో, నాన్న కొట్టాడనో లేక అమ్మ తిట్టిందనో, పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయనో లేక మరే ఇతర కారణాల వలనో ట్రాన్స్ఫార్మర్ ఎక్కి బెదిరించిన వాళ్ళను మనం ఇప్పటిదాకా చూసి ఉంటాము.కానీ ఒక భర్త మాత్రం భార్యతో గొడవ పెట్టుకుని అలిగి వెళ్లి నేరుగా ట్రాన్స్ఫార్మర్ ఎక్కేసాడు.
అక్కడితో ఆగకుండా నేను చచ్చిపోతా అంటూ నానా హంగామా చేసాడు.ట్రాన్స్ఫార్మర్ మీద నుండి దిగి కిందకు రమ్మను ఎంతమంది ఎన్నిసార్లు చెప్పినా వినలేదు.
అక్కడ ఆ ప్రదేశం అంతా బంధువులతో, ఊరి జనంతో నిండిపోయింది.ఎంత చెప్పిన దిగకపోవడంతో చేసేది లేక చివరకు పోలీసులు రంగంలోకి దిగారు.
ఆ వ్యక్తికి నయానో, భయానో నచ్చ చెప్పి ఎలాగయితే కిందకి దింపారు.
అయితే అసలు ఆ వ్యక్తి ఎందుకు ట్రాన్స్ఫార్మర్ ఎక్కాడో అనే విషయం తెలుసుకుని పోలీసులతో సహా అక్కడ ప్రజలు, బంధువులు కూడా అవాక్కయ్యారు.
ఇంతకీ అసలేం జరిగిందో తెలుసుకుందాం.బీహార్ రాష్ట్రంలోని పుర్నియాకు చెందిన సంతోష్ రాయ్ అనే వ్యక్తి మంగళవారం సాయంత్రం బాగా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు.భర్త ఇంటికి రావడంతో అతని భార్య అతడికి అన్నం పెట్టింది.మద్యం మత్తులో ఉన్న సంతోష్ భార్యతో గొడవ పెట్టుకున్నాడు.
ఎందుకు అనుకుంటున్నారు.అన్నం పెట్టావ్ కానీ.
నాకు చాపల కూర కావాలని అడిగాడు.ఆ సమయంలో చేపల కూర ఎక్కడి నుండి తేవాలని.
దాంతో భార్య లేదని చెప్పిందట.సరే ఎలాగోలా వండమంటే ఇప్పుడు వండలేనని భార్య అందట.
అంతే అలిగి నాకు ఇంట్లో విలువ లేదు, నేనంటే లెక్కలేదు.నేను చస్తేనే మీకు తెలిసొస్తుంది’ అంటూ గట్టిగా కేకలు వేసుకుంటూ ఇలా ట్రాన్స్ఫార్మర్ ఎక్కాడు’ అంటూ అతడి భార్య పోలీసులకు జరిగిందంతా చెప్పింది.ట్రాన్స్ ఫార్మర్ ఎక్కడంతో అక్కడి స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.పోలీసులు వచ్చి అతడిని కిందకు దింపే ప్రయత్నం చేసిన అతడు దిగలేదు.ఇంకా చేసేది లేక చేపల కూరను మేము తెప్పిస్తామనీ, కిందకు దిగి రావాలని పోలీసులు అతడికి చెప్పడంతో అతను కిందకు దిగాడు.అయితే అతడు నిజంగానే అదృష్టవంతుడు అని చెప్పాలి.
ఎందుకంటే.అతడు ఎక్కినా ట్రాన్స్ఫార్మర్ 11 కిలో వాట్స్ సామర్ధ్యం కలిగి ఉంది.
సరిగ్గా ఆ రోజు రాత్రి కరెంట్ లేకపోవడంతో సంతోష్ బతికిబట్టకట్టాడు.