కరోనా వైరస్ ప్రజలను ఎంత వణికిస్తున్న శ్రవణం మాసం అని పెళ్లిళ్లు చేసుకునే వాళ్ళు తగ్గలేదు.ఏ వైరస్ వచ్చిన మమ్మల్ని ఆపలేదు అన్నట్టు కొందరు ఓ రేంజ్ లో పెళ్లి చేసుకుంటున్నారు.
ఇంకా ఈ నేపథ్యంలోనే ఓ వ్యక్తి కరోనా కే కాదు వరదలకు కూడా భయపడకుండా ఆ వరదల్లోనే పడవలో ఊరేగి మరీ పెళ్లి చేసుకున్నాడు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.
కరోనాతో పాటు బీహార్ వరదలు పోటెత్తాయి.నదులు ఉప్పొంగి ప్రవాగిస్తున్నాయి.
దీంతో ఇల్లు, విధులు అన్ని నీట మునిగిపోయాయి.అయితే ఇవి ఏమి పక్కించుకోలేదు ముజఫర్పూర్కు చెందిన మహ్మద్ ఇక్బల్ అనే యువకుడు.
వరదలను సైతం లెక్క చెయ్యకుండా పెళ్లి సిద్ధం అయ్యాడు.
రోడ్లు అన్ని జలమయ్యాం అవ్వడం రోడ్డుపై చెయ్యాల్సిన పెళ్లి ఊరేగింపు పడవలోని చేశాడు.
అతను అలా పడవలో కూర్చొని వెళ్తుంటే చుట్టుపక్కల ప్రజలంతా విచిత్రంగా చూస్తూ ఈ సమయంలో పెళ్లి అవసరమా అని కామెంట్లు కూడా చేశారట.అయితే నిజానికి అతని పెళ్లి ఎప్పుడో ఏప్రిల్ జరగాల్సింది కరోనా వైరస్, లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిందట.
అందుకే వరదలు వచ్చిన పెళ్లి కచ్చితంగా జరగాలని ఆ వరుడు ఇలా చేశాడట.ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.