ఎన్నో విమర్శల నడుమ మొదలై ,అత్యధిక టిఆర్పీ తో దూసుకుపోతూ విజయవంతంగా ముగిసింది బిగ్ బాస్ మొదటి సెవన్.ఎన్టీఆర్ మన ఇంటి కుర్రాడిలా కలిసిపోయాడు అని ఎంతో ప్రశంశలు అందించారు.
ఇప్పుడు రెండో సెవన్ మొదలయ్యింది.మరింత మసాలా అంటూ నాని హోస్ట్ చేస్తున్నారు.
మొదటి రోజు అంతగా ఆకట్టుకోలేకపోయింది ఈ షో.ముఖ్యంగా కంటెస్టెంట్స్ చాలా మందికి తెలియకపోవడం పెద్ద మైనస్ అయ్యింది.
“బిగ్ బాస్ 2” షోను నాని హోస్ట్ చేసిన విధానం చాలా పేలవంగా ఉందని, ఎన్టీయార్ లో కనీసం సగం కూడా నాని చేయలేకపోయాడు.ముఖ్యంగా ఏ ఒక్క కంటెస్టెంట్ తోనూ సరిగా ఇంటరాక్ట్ అవ్వలేకపోయాడు అలాగే.ఆడియన్స్ ను కూడా ఎంగేజ్ చేయలేకపోయాడు.నాని హోస్టింగ్ కంటే కంటెస్టెంట్స్ ఆడియో విజువల్స్ బాగున్నాయని మీమ్స్ వచ్చాయంటే అర్ధం చేసుకోవచ్చు.
కంటెస్టెంట్స్ పైన కూడా సోషల్ మీడియా లో ట్రోల్ల్స్ అప్పుడే మొదలయ్యాయి.అమిత్ తివారి సూట్ కేసు, గీత మాధురి వాయిస్.
ఇక దీప్తి సునైనా గురించి సెపరేట్ గా చెప్పనవసరం లేదు అనుకుంట.
ఒక్క తేజస్వి మడివాడ, బాబు గోగినేని మినహా మిగతావారందరందరికీ సెలబ్రిటీ హోదా ఉందా లేదా అనే విషయం పక్కన పెడితే.ఏమాత్రం ఆసక్తి పుట్టించలేని పర్సన్స్ వాళ్ళంతా.సో, కర్టెన్ రైజర్ షో అయితే హోస్టింగ్ పరంగా, కంటెస్టెంట్స్ పరంగా ఫెయిల్ అనే చెప్పాలి.
మరి రానున్న సీజన్స్ ఏమైనా కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉంటే ఒకే లేదంటే మాత్రం ఈ సీజన్ ఫ్లాప్ గా మిగిలిపోతుంది.
షో కి క్రేజ్ పెంచాలని వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా సెలబ్రిటీస్ ని పిలిపించి ప్రయత్నంలో ఉన్నారు అధికారులు.
అయితే మొదటి సీసన్ కూడా మొదట్లో ఆకట్టుకోలేకపోయింది.మెల్లమెల్లగా ఊపందుకున్న విషయం అందరికి తెలిసిందే.
ఈ సారి అలాగే జరుగుడ్డేమో చూడాలి!
.