బిగ్ బాస్ సీజన్ 5 టైటిల్ గెలుచుకున్న వీజే సన్నీ ఆ షో ద్వారా యూత్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు.ఈ క్రమంలో అతను హీరోగా సినిమాలు చేసేందుకు దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు.
ఇప్పటికే సకల గుణాభిరామ సినిమా చేస్తున్న సన్నీ ఈమధ్యనే హరీష్ శంకర్ కథ అందించి నిర్మిస్తున్న ఏ.టి.ఎం వెబ్ మూవీలో ఛాన్స్ కొట్టేశాడు.ఇక ఇప్పుడు సన్నీ లిస్ట్ లో మరో సినిమా వచ్చి చేరిందని తెలుస్తుంది.
డైమండ్ రత్నబాబు డైరక్షన్ లో వీజే సన్నీ హీరోగా ఓ సినిమా వస్తుందని తెలుస్తుంది.ఈ డైలాగ్ రైటర్ గా సూపర్ హిట్ సినిమాలకు పనిచేసిన డైమండ్ రత్నబాబు ఈమధ్యనే మంచు మోహన్ బాబుతో సన్నాఫ్ ఇండియా సినిమాని డైరెక్ట్ చేశాడు.
సన్నాఫ్ ఇండియా సినిమా నిరాశపరచింది.అయినా సరే డైమండ్ రత్నబాబుకి మరో సినిమా డైరక్షన్ ఛాన్స్ వచ్చినట్టు తెలుస్తుంది.బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ వీజే సన్నీ హీరోగా ఈ సినిమా వస్తుంది.అయితే ఈ సినిమా నేపథ్యం ఏంటన్నది ఇంకా బయటకు రాలేదు.
కెరియర్ ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటున్న సన్నీ చేస్తున్న సినిమాలతో తన సత్తా చాటాలని చూస్తున్నాడు.