బిగ్ బాస్ సీజన్ 5 రెండో వారం మొదలైంది.సెకండ్ వీక్ స్టార్టింగ్ రోజు అనగా మండే రోజే నామినేషన్స్ రగడ మొదలైంది.18 మంది హౌజ్ మేట్స్ ను వూల్ఫ్, ఈగల్ రెండు గ్రూపులుగా చేసి ఒకరి గ్రూపులో ఉన్న వారిని మరొకరు నామినేట్ చేసేలా బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు.నామినేషన్స్ అనగానే గొడవ మొదలైనట్టే .ఈ క్రమంలో ఉమాదేవి మరోసారి తన కోపాన్ని ప్రదర్శించింది.అంతేకాదు ఒకసారి బిగ్ బాస్ టీం బీప్ వేసేలా కూడా మాట్లాడింది.
ఉమాదేవి ఉగ్రరూపం తో ఊగిపోయింది.ఆమె మాట్లాడిన ఆ మాటల వల్ల హౌజ్ లో కొందరు షాక్ కు గురయ్యారు.
హౌజ్ లో అందరి కన్నా పెద్ద వయసు వారైన ఉమాదేవి అలా మాట్లాడటం హౌజ్ లో ఉన్న కంటెస్టంట్స్ అందరికి షాక్ ఇచ్చింది.ఇక ఉమా దేవి తర్వాత శ్వేత వర్మ కూడా హమిద, లోబోల మీద ఫైర్ అయ్యింది.
ఆమె కోపంతో బిగ్ బాస్ ఇచ్చిన వాటర్ కలర్ ను హమిద మీద ఫోర్స్ గా కొట్టింది.దాని వల్ల హమిద కొద్దిగా హర్ట్ అయినట్టు అనిపించింది.
ఫైనల్ గా ఈ వారం ఏడుగురు హౌజ్ మేట్స్ నామినేట్ అయ్యారు.వారిలో లోబో, ప్రియ, ప్రియాంకా, ఆర్జే కాజల్, నటరాజ్, ఉమాదేవి, అనీ నామినేషన్స్ లో ఉన్నారు.