బిగ్ బాస్ సీజన్ 5 స్టార్ట్ అవకముందు కంటెస్టంట్స్ లిస్ట్ లో సీరియల్ యాక్ట్రెస్ నవ్య స్వామి, యాంకర్ వర్షిణిల పేర్లు బలంగా వినిపించిన విషయం తెలిసిందే.ఈ ఇద్దరు ఈసారి కంటెస్టంట్స్ గా హౌజ్ లోకి వెళ్లడం పక్కా అని అన్నారు.
కాని సీజన్ 5లో 19 మంది కంటెస్టంట్స్ వచ్చినా వీరిద్దరు మాత్రం ఎంట్రీ ఇవ్వలేదు.ఈ క్రమంలో బిగ్ బాస్ లో నవ్య, వర్షిణిలను చూద్దామనుకున్న వారి అభిమానులకు నిరాశ తప్పలేదు.
అయితే నవ్య, వర్షిణిలను కావాలనే బిగ్ బాస్ ఆపారని తెలుస్తుంది.
ఈ ఇద్దరిలో ఒకరిని రెండో వారం కాని.
మూడో వారం కాని వైల్డ్ కార్డ్ ఎంట్రీగా పంపిస్తారని టాక్.ఆ తర్వాత వారం కూడా మరొకరిని పంపిస్తారని చెబుతున్నారు.
నవ్య, వర్షిణి ఇద్దరు కూడా బిగ్ బాస్ ఆటలో ఉన్నారని తెలుస్తుంది.వారికి బిగ్ బాస్ భారీ రెమ్యునరేషన్ ఇచ్చి తీసుకున్నట్టు తెలుస్తుంది.
ఇద్దరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి ఆటని మరింత క్రేజీగా మార్చేస్తారని చెబుతున్నారు.తప్పకుండా ఇప్పుడున్న హౌజ్ మేట్స్ కు జోడీగా వర్షిణి, నవ్య వస్తే మాత్రం షో మీద ఇంకాస్త ఆసక్తి పెరిగే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.