బిగ్ బాస్ సీజన్ 5లో బుధవారం ఎపిసోడ్ హౌజ్ మెట్స్ మధ్య తీవ్ర వివాదాలతో నడిచిందని చెప్పొచ్చు.కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా ఈగల్, ఊల్ఫ్ టీం లకు టాస్క్ ఇచ్చిన బిగ్ బాస్ ఒక రౌండ్ తర్వాత మరొక రౌండ్ లో వారి మధ్య వివాదలను సృష్టిస్తున్నాడు.
ఈగల్ టీం వర్సెస్ ఊల్ఫ్ టీం మధ్యన గొడవలు ఉదృతంగా మారాయి.గెలిచిన టీం నుండి కెప్టెన్సీ టాస్క్ కు ఎంపికవుతారని బిగ్ బాస్ చెప్పగా ఇరు జట్లు టాస్క్ గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ క్రమంలో హౌజ్ మెట్స్ మధ్య గొడవలు జరిగాయి.
నిన్నటి నుండ్ సిరి, వీజే సన్నిల మధ్య గొడవ కొనసాగుతుండగా.
ఈరోజు శ్రీరాం చంద్ర, రవిల మధ్య చిన్న డిస్టబెన్స్.ఇంకా శ్రీరాం చంద్ర, మానస్ ల మధ్య చిన్న గొడవ జరిగింది.
అంతేకాదు టాస్క్ టైం లో అనీ వర్సెస్ ఉమాదేవి మాట్ల యుద్ధం జరిగింది. ప్రియ కూడా వీజే సన్నీ మీద ఫైర్ అయ్యారు.
మొత్తానికి ఈ ఫిజికల్ టాస్క్ హౌజ్ మేట్స్ మధ్య వివాదాలు సృష్టించిందని చెప్పొచ్చు.ఇరు జట్లు గెలవడమే లక్ష్యంగా ఆడుతున్న విధానం బాగున్నా ఇది బయటకు ఎలా ప్రొజెక్ట్ అవుతుంది అన్న విషయాన్ని ఆలోచించడం మానేశారు.
ముఖ్యంగా ఈ టాస్క్ లో వీజే సన్నీని అందరు టార్గెట్ చేశారు.