ఈసారి టాలీవుడ్ లో బిగ్ ఫైట్ తప్పేలా లేదు.ఎందుకంటే కరోనా కారణంగా వందలాది సినిమాలు షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదల సిద్ధంగా ఉన్నాయి.
కొన్ని సినిమాల నిర్మాతలు ఇంకా అధిక భారాన్ని భరించలేక ఓటిటీ లను ఆశ్రయించారు.కానీ పెద్ద సినిమాలు మాత్రం అలా రావడానికి సిద్ధంగా లేవు.
ఎందుకంటే థియేటర్స్ లో విడుదల అయితే సూపర్ హిట్ టాక్ వస్తే చాలు.రికార్డ్ కలెక్షన్స్ వస్తాయి.
కానీ ఓటిటీ లలో అలా కాదు.వాళ్ళు ఇచ్చిన డీల్ ఓకే చెయ్యాలి.అయితే ఇప్పుడిప్పుడే కరోనా తక్కుముఖం పడుతున్న నేపథ్యంలో థియేటర్స్ ఓపెన్ అయ్యాయి.కానీ ఇంకా పూర్తి స్థాయి థియేటర్స్ ఓపెన్ అవ్వలేదు.
అయినా చిన్న సినిమాలు విడుదల అవుతూనే ఉన్నాయి.అయితే ఇప్పుడు పెద్ద సినిమాలు మధ్య గట్టి పోటీ నెలకొనే అవకాశం ఉంది.
ఎందుకంటే అందరు పండుగ సీజన్స్ లోనే రావాలని అనుకుంటున్నారు.
పండగ సీజన్స్ లో అయితే భారీ కలెక్షన్స్ వస్తాయి.
అందుకే ఎవ్వరు వెనకడుగు వేయడానికి ఇష్టపడడం లేదు.దాంతో ఈసారి బిగ్ ఫైట్ ఉండబోతుందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది.
ముందు నుండి అందరి కళ్ళు సంక్రాంతి రేస్ మీద ఉన్నాయి.ఇప్పటికే నాలుగు పెద్ద పెద్ద సినిమాలు ఫైటింగ్ కు రెడీ అయిపోయాయి.
మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాతో సంక్రాంతి బరిలోకి రాబోతున్నాడు.
అటు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాతో, ఇటు వెంకటేష్, వరుణ్ తేజ్ ఎఫ్ 3 సినిమాతో రాబోతున్నట్టు కన్ఫర్మ్ చేసారు.అయితే నాగార్జున కూడా బంగార్రాజు సినిమాను సంక్రాంతికే విడుదల చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.ఇది ఇలా ఉంటే.
ఇప్పుడు అంతకన్నా ముందు చిరంజీవి, బాలయ్య మధ్య ఫైట్ జరగబోతున్న సూచనలు కనిపిస్తున్నాయి.వీరిద్దరూ యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు పోటాపోటీగా రిలీజ్ చేసే వారు.
మళ్ళీ ఇంత కాలానికి ఎవ్వరు వెనక్కి తగ్గేలా కనపడడం లేదు.
ప్రస్తుతం చిరు నటించిన ఆచార్య సినిమా విడుదలకు సిద్దముగా ఉంది.అంతేకాదు రాజమౌళి తెరకెక్కించిన ఎంతగానో ఎదురు చూస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా కూడా అక్టోబర్ లో రాబోతుంది.వీటితో పాటు బాలకృష్ణ నటించిన అఖండ సినిమా కూడా చివరి దశలో ఉంది.
దీంతో ఈ మూడు సినిమాల్లో ఏదో ఒకటి ఎవరితోనే ఒకరితో దసరా బరిలో పోటీ పడే సూచనలు ఉన్నాయి.మరి చూడాలి చివరి దాకా రేస్ లో ఎవరు నిలుస్తారో.