సోషల్ మీడియా వచ్చాక చాలా మంది విశేషమైన గుర్తింపును అందుకుంటున్నారు.అందులో కొంత మంది మంచి పేరును సంపాదించుకుంటే.
మరి కొందరు మాత్రం వైవిధ్యమైన వ్యవహార శైలితో వివాదాల్లో చిక్కుకుంటుండడం చూస్తూనే ఉన్నాం.అలాంటి వారిలో యూట్యూబర్ సరయు రాయ్ ఒకరు.
సెవెన్ ఆర్ట్స్ అనే చానెల్ ద్వారా తెలుగు నెటిజన్లకు పరిచయమైన ఈ బ్యూటీ.చాలా తక్కువ సమయంలోనే భారీ స్థాయిలో ఫాలోయింగ్ను సంపాదించుకున్నారు.
దీనికి కారణం ఆమె బోల్డు వీడియోలు చేయడమే.ఇటీవలే బిగ్ బాస్ ఐదో సీజన్లోకి కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చి.
అనూహ్యంగా మొదటి వారమే ఎలిమినేట్ అయిపోయారు సరయు.
బిగ్బాస్ షో నుంచి బయటికి వచ్చాక వరుస ఇంటర్వ్యూలతో బిజీ అయిపోయారు సరయు.
అయితే బిగ్బాస్ హౌస్ మేట్స్ చాలా మందిపై నెగెటివ్ కామెంట్స్ చేసిన సరయు.చివరికి బిగ్బాస్పైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వైరల్ అయిన సంగతి అందరికీ తెలిసిందే.
బిగ్ బాస్ షో కేవలం స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతుందని.అందులో కొందరు కంటెస్టెంట్ లు స్క్రిప్టు ప్రకారమే ఆడుతున్నారనీ బిగ్ బాస్ హౌస్ లో తాను చేసిన పాజిటివీటినీ కాకుండా, నెగిటివిటీని చూపించారు అంటూ ఆరోపించారు.
ఇకపోతే ఒక ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ గురించి మాట్లాడుతూ పవర్ స్టార్, చిరంజీవిలకు తాను ఓ పెద్ద ఫ్యాన్ అని వెల్లడించారు.అంతేకాకుండా పవన్ కల్యాణ్ మేనరిజం చూసి తాను ఆయన ప్రేమలో పడ్డానని, ఆయనంటే క్రేజ్ అని ఆమె తెలిపారు.అవకాశం వస్తే పవన్ కల్యాణ్తో కలిసి ఒక్క సినిమాలో నటించాలని ఉందని సరయు అన్నారు.టాలీవుడ్ అంటే తనకు చిన్నప్పటి నుంచీ ఎంతో గౌరవమని, సినిమాలంటే ఇష్టమన్న సరయు.
ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చాలా మంది కమిట్మెంట్ అడిగారని ఆమె తెలిపారు.అలా ఎవరైనా కమిట్మెంట్ అడిగితే బాధపడే దానినని, నా ముఖం అలా కనిపిస్తుందా అంటూ ఏడ్చేదాన్నని సరయు అన్నారు.
అంతేగాకుండా తన మెంటాలిటీకి తగిన వ్యక్తిని తాను వివాహం చేసుకుంటానని ఆమె ఈ సందర్భంగా వెల్లడించారు.