బిగ్బాస్ తెలుగు సీజన్ 4 లో నిన్నటి ఎపిసోడ్ లో అద్బుతం జరిగింది అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ వస్తున్నాయి.ఒక మూగ అమ్మాయికి మాటలు వచ్చాయి.
ఆ మాటలతో నిన్న షో అంతా తనదే అనిపించుకుంది.ఆ అమ్మాయి మరెవ్వరో కాదు దివి.
నిన్న ఉదయం నుండే దివికి సంబంధించిన ప్రోమోలో విడుదల అవ్వడంతో నెటిజన్స్ షో కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు.దివి మాటలు కేవలం ప్రోమోకే పరిమితమా లేదా అనేది కొందరు అనుమానం వ్యక్తం చేశారు.
అయితే బిగ్బాస్ ప్రోమోను మించి నిన్నటి ఎపిసోడ్ లో దివి రచ్చ రచ్చగా మాట్లాడింది.మార్నింగ్ మస్తీ కార్యక్రమంలో భాగంగా దివికి మాట్లాడే అవకాశం వచ్చింది.
కంటెస్టెంట్స్ గురించి ఆమె మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు అందరికి వ్యాలిడ్ పాయింట్స్ అనిపించాయి.చాలా మంది కూడా వావ్ దివి ఇంత బాగా మాట్లాడిందే అనుకున్నారు.
తెలుగులో ఇంత చక్కగా దివి మాట్లాడుతుందని తాను అనుకోలేదు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.ఎలిమినేషన్లో ఉన్న దివికి నిన్నటి షో చూసిన తర్వాత చాలా మంది ఓట్లు గుద్దేశారు.
దివి మాట్లాడటం లేదు అంటూ వచ్చిన విమర్శలకు నిన్నటి ఎపిసోడ్ తో ఫుల్ స్టాప్ పడ్డట్లే.కేవలం మార్నింగ్ మస్తీలో మాత్రమే కాకుండా సోహెల్ మరియు అరియానాల సీక్రెట్ టాస్క్ విషయంలో కూడా దివి ఇంటి సభ్యులను ఎక్కువగా ఆలోచించవద్దు అంటూ సూచించింది.
మొత్తానికి బిగ్బాస్ లో దివి మాట్లాడటం జరిగింది.ఆ మాటలతో దివికి ఒక్కసారిగా ఓట్లు పోల్ అవ్వడంతో ఆమె గ్రాఫ్ పైకి వెళ్లింది.నిన్నటి ఎపిసోడ్ చూసిన ఎవరైనా కూడా దివికి ఓట్లు వేయడంలో ఎలాంటి తప్పు లేదు అంటూ ఓట్లు గుద్దేసి ఉంటారు అనడంలో సందేహం లేదు.దివికి ఇచ్చిన టాస్క్ ఆమెకు మరింత సాయం అయ్యింది.
షో లో దివి మాట్లాడటం లేదు అనే విమర్శల నుండి ఆమెను తప్పించేందుకు నిన్నటి మార్నింగ్ మస్తీ కార్యక్రమాన్ని ఆమెకు కేటాయించినట్లుగా తెలుస్తోంది.రెండు మూడు రోజుల్లోనే మనుషులను అర్థం చేసుకుని వారి గురించి ఉన్న బ్యాడ్ ను సున్నితంగా వివరించి వారిని మార్చుకునేలా చేసిన వ్యక్తి దివి.
కనుక ఆమె షో లో చాలా రోజులే ఉంటుందని, ఆమె ఒక బలమైన కంటెస్టెంట్గా నిలవడం ఖాయం అంటున్నారు.