బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 5 లో ఎన్నో ఆశలు పెట్టుకొని అడుగుపెట్టింది బోల్డ్ బ్యూటీ సరయు.కానీ అప్పుడే ఇంటి పయనం పట్టింది.
షో మొదటి రోజు నుండి తాను వెళ్లే రోజు వరకు హౌస్ లో ఉంటూ అందరితో బాగానే కలిసి పోయింది.ఇక మరికొంతమంది కంటెస్టెంట్ లతో మాత్రం ఓ రేంజ్ లో ఫైర్ అవగా ఆ ఫైర్ మొత్తాన్ని హౌస్ లో ఉన్నంత కాలం బయట పెట్టలేదు.
కానీ ఇంటి నుండి బయటకు అడుగుపెట్టాక మాత్రం సరయు మాటలు విని అందులో ఉన్న కంటెస్టెంట్ లే షాక్ అయ్యారు.
యూట్యూబ్ లో సెవెన్ ఆర్ట్స్ అనే వేదికగా బూతు మాటలతో వీడియోలను చేస్తూ బాగా హాట్ టాపిక్ గా నిలిచింది సరయు.
నిజానికి ఈమె మాట్లాడే బూతు మాటలు వింటే మాత్రం ఈమెను విమర్శించకుండా ఉండలేరు.అటువంటిది ఈమెకు బిగ్ బాస్ లో అవకాశం ఇచ్చినందుకు బిగ్ బాస్ పై కొందరు నెటిజన్లు మండిపడ్డారు.
ఇటువంటి వాళ్లను ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు అంటూ విమర్శించారు.అంతేకాకుండా మొదటి ఎలిమినేషన్ లోనే ఇంటి నుంచి వెళ్ళిపోతుందని అన్న వెంటనే మొదటి వారంకే ఎలిమినేట్ అయింది.
దీంతో ఎలిమినేట్ అయిన రోజు వేదికపై ఎవరు వరెస్ట్, ఎవరు బెస్ట్ అనే కాన్సెప్ట్ తో మాత్రం కొందరి కంటెస్టెంట్ లను దుమ్ము దులిపింది సరయు.
ఇక బిగ్ బాస్ బజ్ తరపున ఇంటర్వ్యూలో పాల్గొన్న సరయు కొందరి కంటెస్టెంట్ లపై బాగానే మండిపోయింది.ఇక ఇంటర్వ్యూ కి సంబంధించిన వీడియోలో చేసిన హాట్ హాట్ కామెంట్లు మాత్రం బాగా వైరల్ గా మారింది.ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈమె తీసుకున్న పారితోషకం గురించి కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.ఆమె బిగ్ బాస్ హౌస్ లో వారం రోజులకు అందుకున్న పారితోషకం దాదాపు రూ.70 వేల నుంచి లక్ష రూపాయల వరకు అని తెలుస్తుంది.