బిగ్ బాస్ షోలో తాజాగా జరిగిన ఎపిసోడ్ లో బిగ్ బాస్ నాగార్జున వచ్చీరావడంతోనే కంటెస్టెంట్ లతో ఒక వెరైటీ గేమ్ ఆడించాడు.సినిమాలలోని ఫేమస్ పాత్రలను స్క్రీన్ పై చూపించి ఆ పాత్రలు ఎవరికి సెట్ అవుతాయో అని చెప్పాలి అన్నారు.
దీనితో మొదట మహానటి పోస్టర్ చూపించగా సన్నీ, ఆ పాత్ర ప్రియాంకకు పర్ఫెక్ట్ సూట్ అవుతుందని అన్నాడు.వషికరన్ పాత్ర షణ్ముఖ్ కి సూట్ అవుతుంది అని తెలిపింది సిరి.
ఇలా కంటెస్టెంట్ లు సినిమా పాత్రలను ఒకరి ఒకరు అంకితం ఇచ్చుకున్నారు.
ఆ తరువాత నాగ్ హౌస్ మేట్స్ తో లూడో గేమ్ ఆడించాడు.
ఈ క్రమంలోనే మానస్ పిల్లోతో రోమాన్స్ చేయాలని నాగార్జున ఆదేశించగా, అందులో మానస్ ఫెయిల్ అయ్యాడు.పిల్లోతో ఎలా రోమాన్స్ చేయడం అని అతడు ఎదురు ప్రశ్నించగా.
వెంటనే నాగార్జున ప్రియాంకతో చేస్తావా? అని సూటిగా అడిగాడు.వెంటనే మానస్ వద్దు పిల్లలే నయం అన్నప్పటికీ ఇంటి సభ్యులు అందరూ కలిసి పింకీ తో రోమాన్స్ చేయించారు.
అనంతరం లూడో గేమ్ లో సన్నీ, కాజల్ గెలవగా ప్రియాంక ఎలిమినేట్ అయినట్లు ప్రకటించగానే ఎమోషనల్ అయ్యింది.
ఈ క్రమంలోనే నాతో కొంచెం ఎక్కువగా టైం స్పెండ్ చేయాల్సిందని మానస్ తో చెప్పుకుంటూ బాధపడింది.
అనంతరం స్టేజీపై కు వచ్చి కంటెంట్ తో ముచ్చటించింది.
ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టినప్పుడు కంటెస్టెంట్ లతో ఆమెకు ఉన్న అభిప్రాయం ఎలాంటిదో చెప్పాలి అంటూ ఒకటి టాస్క్ ను ఇచ్చాడు నాగార్జున.బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టినప్పుడు మానస్ ని చూసి హాయ్ చెప్తే అతడు స్పందించలేదు .ఎంత పొగరు అసలు మాట్లాడొద్దు అని అనుకున్నాను.ఆ తరువాత మా మధ్య మంచి ఫ్రెండ్ షిఫ్ కుదిరింది.నేను నీ నుంచి చాలా నేర్చుకున్నాను.నీతో ఎప్పటికీ ఫ్రెండ్ షిఫ్ కావాలి.నీ నుంచి ఏం ఎక్స్ పెక్ట్ చేస్తున్నాను అని పదేపదే అడుగుతున్నావు కదా నేను నీ విజయాన్ని కోరుకుంటున్నాను అని చెప్తు ఎమోషనల్ అయ్యింది పింకీ.