తెలుగు బిగ్ బాస్ సీజన్ ఫైవ్ 19 మంది కంటెస్టెంట్ ల తో ప్రారంభమై ఆరు వారాలలో ఎంతో విజయవంతంగా పూర్తిచేసుకొని ఆరుగురు కంటెస్టెంట్ లను హౌస్ నుండి ఎలిమినేట్ చేశారు.అయితే ఇందులో ఐదుగురు ఆడవాళ్ళు ఉండటం గమనార్హం.
అయితే ఇప్పటికే హౌస్ లో ఉన్న పలువురు కంటెస్టెంట్ లను గురించి పలువురు బుల్లితెర తారలు వారికి మద్దతు తెలుపుతూ వారికి ఓటు వేసి వారిని గెలిపించాలని చెబుతున్నారు.ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్ కోసం ఏకంగా క్రేజీ హీరోయిన్ రంగంలోకి దిగింది.
ఆర్ఎక్స్ 100 ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ బిగ్ బాస్ 5 గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.ఇందులో ఉన్నటువంటి కంటెస్టెంట్ లలో తన ఫ్రెండ్ సింగర్ శ్రీరామచంద్ర ఎంతో అద్భుతంగా గేమ్ ఆడుతున్నారని, తన గేమ్ చూసి తననీ అభినందించకుండా ఉండలేకుండాపోతున్నానని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.
ఈ క్రమంలోనే తన ఫ్రెండ్ సింగర్ శ్రీరామచంద్రకు ఓట్లు వేసి అందరి మద్దతు అతనికి తెలియజేయాలని ఈ సందర్భంగా పాయల్ సింగర్ శ్రీరామచంద్రకు తన మద్దతు తెలిపింది.
ఇకపోతే శ్రీ రామచంద్ర గత వారాలలో హమీదతో లవ్ ట్రాక్ లో ఉంటూ పూర్తిగా ఆమెతో సమయం గడపటానికి కేటాయించారు.ఈ క్రమంలోనే హమీదా హౌస్ నుండి ఎలిమినేట్ అయిన తర్వాత శ్రీరామ చంద్ర ఎంతో అద్భుతంగా టాస్క్ లలో పాల్గొంటూ ఎంతో చురుకుగా ఉంటున్నారు.ఈ క్రమంలోనే శ్రీరామచంద్రకు ఓట్లు వేసి తనను గెలిపించాలని ఆర్ఎక్స్ బామ అతనికి మద్దతుగా నిలబడింది.