తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ షో చూస్తుండగానే ముగింపు దశకు చేరుకుంది.మరొక రెండు వారాల్లో బిగ్ బాస్ షో ముగియనుంది.దీనితో కంటెస్టెంట్ ల మధ్య పోటీ హోరాహోరీగా జరుగుతోంది.19 మందితో గ్రాండ్ గా ప్రారంభం అయిన ఈ షోలో ప్రస్తుతం ఏడుగురు మాత్రమే మిగిలారు.ఫినాలేలో చోటు దక్కించుకోవడం కోసం కంటెస్టెంట్ లో నువ్వా నేనా అన్న రీతిలో పోటిపడుతున్నారు.ఇప్పటికే హౌస్ లో షణ్ముఖ్, సన్నీల మధ్య పోటీ హోరాహోరీగా జరుగుతోంది.
ఇక ఈ వారం నామినేషన్ లో షణ్ముక్, సన్నీ తప్ప మిగిలిన వారందరూ నామినేషన్ లో ఉన్నారు.ఇక వీరిలో శ్రీరామ్ అత్యధిక ఓట్లతో ముందువరుసలో దూసుకుపోతున్నాడు.
ఒకవైపు శ్రీరామ్ తెలివిగా గేమ్ పై ఫోకస్ పెడుతూ ఆడుతుంటే, మానస్ కూడా కేవలం గేమ్ పైన దృష్టి పెడుతూ తనకు అత్యధిక ఓట్లు పడేలా జాగ్రత్త పడుతున్నాడు.మిగిలిన కంటెస్టెంట్ లు సిరి, కాజల్, ప్రియాంక.
అయితే గత వారంలోనే ఈ ముగ్గురు నుంచి ఒకరు ఎలిమినేట్ అవుతారని అందరూ భావించారు.
కానీ ఎవరూ ఊహించని విధంగా ఈ ముగ్గురు కంటెస్టెంట్ లో కాకుండా హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన యాంకర్ రవిని ఎలిమినేట్ చేశారు బిగ్ బాస్.ఇకపోతే ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ప్రియాంక వెళ్లనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఒకవేళ ప్రియాంక కాకుంటే కాజల్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అయితే ఈవారం వీరిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అన్నది ప్రేక్షకులు అంచనా వేయలేకపోతున్నారు.ఎందుకంటే గత వారం ఎవరు ఊహించని విధంగా యాంకర్ రవిని ఎలిమినేట్ చేయడంతో ఈ వారం వీరిద్దరిలో నుంచి ఒకరిని ఎలిమినేట్ చేస్తారా? లేక హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ను ఎలిమినేట్ చేస్తారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.