బుల్లితెరపై ఇటీవలే ప్రారంభమైన రియాలిటీ షో బిగ్ బాస్ ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.పైగా బుల్లితెర ప్రేక్షకులు కూడా ఈ రియాలిటీ షో ను చూడటానికి తెగ ఆరాటపడుతున్నారు.
ఇప్పటికే నాలుగు సీజన్ లు పూర్తవగా ఈ ఐదవ సీజన్ మాత్రం మరింత హైలెట్ గా కనిపిస్తుంది.ఇందులో ఏకంగా 19 మంది కంటెస్టెంట్ లు పాల్గొన్నారు.
చాలా వరకు అందరూ పరిచయమున్న సెలబ్రిటీలే.కానీ జెస్సీ అలియాస్ జశ్వంత్ మాత్రం ఎవరికీ అంతగా తెలియకపోవడంతో అతని గురించి బాగా కనుకుంటున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా జశ్వంత్ మరో కంటెస్టెంట్ కాళ్లు పట్టుకొని బాగా ఏడ్చాడు.
ఇప్పటివరకు ఇతని గురించి తెలుగు ప్రేక్షకులకు ఎక్కడ కూడా తెలుసుకోలేదనే చెప్పాలి.
కానీ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టాక మాత్రం అందరి దృష్టిలో పడ్డాడు.మొదటిరోజు బాగా సైలెంట్ గా కనిపించగా కాస్త ఎమోషనల్ కూడా అయ్యాడు.
దీంతో తెలుగు ప్రేక్షకులందరూ జశ్వంత్ చాలా అమాయకుడని అనుకోని కాస్త సానుభూతి చూపారు.కానీ మరుసటి రోజు ఇతడు మరో కంటెస్టెంట్ అనీ మాస్టర్ పై చేసిన రచ్చతో అమాయకుడు అనుకున్నా ప్రేక్షకులను షాక్ అయ్యేలా చేశాడు.
అసలు ఏం జరిగిందంటే.జశ్వంత్ మరో కంటెస్టెంట్ సిరి కోసం ఒక సీటును ఉంచి దాని పై కాలు పెట్టాడు.
అంతలోనే అనీ మాస్టర్ వచ్చి అతడిని కాలు తీయమని అనడంతో అలా వారి మధ్య కాసేపు మాటల యుద్ధం గట్టిగానే జరిగింది.దీంతో అందరూ జశ్వంత్ ను చూసి షాక్ అయ్యారు.ఇక జశ్వంత్ తన తప్పు తెలుసుకొని అనీ మాస్టర్ దగ్గరికి వెళ్లి ఆమె కాళ్లు పట్టుకొని సారీ చెబుతూ ఏడ్చాడు.పైగా ఆమె ముందు నిల్చొని ఎమోషనల్ అయ్యాడు.
మీరు నా తల్లి లాంటి వాళ్లు.తప్పు నాదే.
క్షమించండి అని నోరు జారడంతో వెంటనే ఏంటి తల్లి లాంటి దాన్నా అని అనీ మాస్టర్ ప్రశ్నించింది.వెంటనే కాదు కాదు అంటూ మళ్లీ సారీ చెప్పాడు.
ఇక అనీ మాస్టర్ కూడా తాను కూడా ఇలా చేయడం తప్పు అంటూ.అప్పుడే ఇలా మాట్లాడితే ఇంత గొడవ జరిగేది కాదు అని అతడితో మాట్లాడింది.