బిగ్ బాస్ హౌస్ లో ఏడవ వారం హౌస్ నుంచి ప్రియా ఎలిమినేట్ అయిన తర్వాత హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లకు బిగ్ బాస్ ఒక సర్ప్రైజ్ ఇచ్చారు.బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన కంటెస్టెంట్ లు 50 రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా వారికి వారి ఇంటి నుంచి లెటర్స్ వచ్చాయని శుభవార్తను తెలిపారు.
అయితే ఈ లెటర్ పొందాలంటే మరొకటి వదులుకోవాలని బిగ్ బాస్ కండిషన్ పెట్టాడు.ఇలా బిగ్ బాస్ పవర్ రూమ్ లోకి ఇద్దరు పోస్ట్ మాన్ లను పంపించి లెటర్స్ అందిస్తారు.
ఎవరైతే లెటర్ ను అందుకోలేక పోతారో వారు నామినేట్ అయినట్లు.
ఈ క్రమంలోనే పవర్ రూమ్ లోకి వెళ్లిన సిరి, అనీ మాస్టర్ లకు కాజల్, షణ్ముఖ్ జస్వంత్ లెటర్లు అందాయి.
ఇలా కాజల్ తన భర్త నుంచి లెటర్ రావడంతో మొట్టమొదటిసారిగా హౌస్ లో కన్నీళ్ళు పెట్టుకొని ఎంతో ఏమోషనల్ అయింది.కాజల్ ఎమోషనల్ అవ్వడం చూసిన షణ్ముఖ తన లెటర్ ను వదులుకొని నామినేట్ అవడానికి సిద్ధపడతాడు.
ఆ సమయంలో సిరి కల్పించుకొని నేను ఎలాగో లెటర్ తీసుకోలేదు కనీసం నువ్వైనా తీసుకో అనడంతో షన్ను తన లెటర్ వదులుకోవడానికి సిద్ధపడ్డాడు.
ఇలా తన ఇంటి నుంచి వచ్చిన లెటర్ ముక్కలు కావడంతో షన్ను ఎంతో ఎమోషనల్ అయ్యాడు.ఈ క్రమంలోనే షన్ను మాట్లాడుతూ… అమ్మ నువ్వు క్యాన్సర్ ను జయించావు.అదేవిధంగా అమ్మమ్మ చనిపోయినప్పుడు ఆ బాధ నుంచి తొందరగా బయట పడ్డావు.
నువ్వే నా ఇన్స్పిరేషన్.నిన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకొని నేను కూడా ఈ బాధ నుంచి తొందరగా బయటపడతాను అంటూ ఎమోషనల్ అయ్యాడు.
ఇలా తన మనసులోని బాధను బయట పెట్టి తన భారాన్ని దించుకున్నారు.