బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షోలలో ఒకటైన బిగ్ బాస్ షోలో రెండో వారం ఉమాదేవి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఉమాదేవి వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రేక్షకులకు తెలియని ఎన్నో విషయాలను పంచుకుంటున్నారు.
హౌస్ లో బూతులు మాట్లాడటం ఆమెకు మైనస్ గా మారింది.రెండో వారం ఓట్లు తక్కువగా రావడంతో ఉమాదేవి బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది.
రెండో వారం బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రావడం తనకు బాధ కలిగించిందని ఆమె అన్నారు.ప్రియాంక సింగ్, ప్రియలతో తాను కిచెన్ లో కలిసి పని చేశానని అందువల్ల తనకు వాళ్లిద్దరితో స్నేహం కుదిరిందని ఆమె వెల్లడించారు.
ఇప్పటివరకు బిగ్ బాస్ హౌస్ సీజన్ 5లో విశ్వ, సిరి కెప్టెన్లుగా వ్యవహరించగా విశ్వ పర్ఫెక్ట్ అని ఉమాదేవి పేర్కొన్నారు.టాప్ 5లో ఉండే కంటెస్టెంట్ల గురించి మాట్లాడుతూ ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
టాప్ 5లో ఉండే కంటెస్టెంట్లలో యాంకర్ రవి, జశ్వంత్ పడాల, వీజే సన్నీ, మానస్ ఖచ్చితంగా ఉంటారని ఉమాదేవి అభిప్రాయపడ్డారు.
వీజే సన్నీ బయట ఏ విధంగా ఉంటాడో బిగ్ బాస్ హౌస్ లో కూడా అదే విధంగా ఉన్నాడని ఆ రీజన్ వల్లే సన్నీకి సపోర్ట్ చేయాలని తాను అనుకుంటున్నానని ఉమాదేవి అభిప్రాయపడ్డారు.బిగ్ బాస్ హౌస్ లో మొదటి రెండు వారాలు లేడీ కంటెస్టెంట్లు ఎలిమినేట్ కావడంతో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాల్సి ఉంది.
బిగ్ బాస్ షోకు 6 కంటే ఎక్కువ రేటింగ్ వస్తుండగా రాత్రి ఆలస్యంగా ప్రసారమవుతూ ఉండటం ఈ షోకు మైనస్ అవుతోంది.మరి రాబోయే రోజుల్లో బిగ్ బాస్ షో వీక్ డేస్ టైమింగ్స్ ను మారుస్తారో లేదో చూడాల్సి ఉంది.