బిగ్ బాస్ సీజన్ 5లో రోజుకో ఆసక్తి కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.వారం రోజుల క్రితం ప్రారంభమైన ఈ షోలో బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ లు, శిక్షలతో మొదటి వారం రోజులు ఉత్కంఠగా సాగింది.
ఇక తాజాగా జరిగిన ఎపిసోడ్ లో నామినేషన్ లో ఉన్న సరయు ఎలిమినేట్ అయ్యింది.
ఇదిలా ఉండగా… బిగ్ బాస్ అంటేనే ఒక డ్రామా… అంతా స్క్రిప్ట్ ప్రకారమే ఆ షో సాగుతుందని సోషల్ మీడియాలో ఎప్పట్నుంచో ప్రచారం జరుగుతునే ఉంది.
హౌజ్ లోకి ఎంటర్ అయిన 19 మంది సభ్యులు… స్క్రీన్ స్పేస్ దక్కించుకోవడం కోసం ఏదో ఒక విధంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు.అందులో భాగంగా ఒకరు ఏడుపును ఎంచుకుంటే.
మరొకరు కొట్లాడడం, ఇంకొకరు కామెడీ ఇలా ఏదో ఒకటి చేసి బిగ్ బాస్ ను మెప్పించేందుకు నానా తంటాలు పడుతున్నారు.
ఇక సరయు అన్న మాటలను బట్టి చూస్తే…అంతా స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతుందన్న ప్రచారంపై నిజమేనని అనిపిస్తోంది.
సిరి హన్మంతు, సన్ని, యాంకర్ రవి, షణ్ముఖ్ పక్కా ప్లాన్ ప్రకారమే గేమ్ ఆడుతున్నారని… వారంతా ఒక్కటై మిగతా వారిని తొక్కేస్తున్నారని సరయు కాంట్రవర్సీని క్రియేట్ చేసే కామెంట్స్ చేశారు.రవి మామూలోడు కాదని, సిరి గెలవడం కోసం మగవాళ్ళను వాడుకుంటుందని… షణ్ముఖ్ సాప్ట్ అనుకున్నా కానీ… ఖతర్నాక్ అని .వాడొక ఆడంగి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది సరయు.వీరు నలుగురు మిగతా సభ్యులను తొక్కేసి ….
వీళ్ళల్లోనే ఒకరు కచ్చితంగా టైటిల్ గెలుస్తారని ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది.ఇక నిజంగానే వీరు ప్లాన్ తోనే హౌజ్ లోకి వచ్చారా.? వీళ్ళే టాప్ 5 కంటెస్టెంట్స్ గా నిలుస్తారో లేదో.చివరి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.!
.