బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ఈ ఆదివారం ప్రసారం కానున్న సంగతి తెలిసిందే.గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కు సంబంధించిన షూటింగ్ రేపు జరగనుంది.
గత సీజన్లలాగే ఈ సీజన్ ఫినాలే ఎపిసోడ్ ను కూడా గ్రాండ్ గా ప్లాన్ చేయగా ఫినాలేకు గెస్ట్ కూడా కన్ఫామ్ అయ్యారని తెలుస్తోంది.ఈ సీజన్ కు గెస్ట్ గా మహేష్ బాబు, ఎన్టీఆర్, చిరంజీవి పేర్లు వినిపించగా చిరంజీవినే నిర్వాహకులు ఫైనలైజ్ చేశారని చిరంజీవి బిగ్ బాస్ షోకు రావడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.
బిగ్ బాస్ సీజన్ 4లో మొత్తం 19 మంది కంటెస్టెంట్లు పాల్గొనగా ట్రోఫీ కోసం ఐదుగురు కంటెస్టెంట్లు పోటీ పడుతున్నారు.అభిజిత్, సోహైల్, అరియానాలలో ఎవరో ఒకరు విన్నర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అభిజిత్ విన్నర్ అవుతాడని బిగ్ బాస్ ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తుండగా ఈ సీజన్ లో లేడీ కంటెస్టెంట్ అరియానా విన్నర్ కావచ్చని బిగ్ బాస్ నిర్వహకులు ఈ విధంగా ప్లాన్ చేశారని మరో వాదన వినిపిస్తోంది.
అరియానా బిగ్ బాస్ ఇచ్చే ఫ్రైజ్ మనీలో కొంత మొత్తం రైతుల కోసం ఖర్చు చేస్తానని కొన్ని రోజుల క్రితం చెప్పడం ఆమెకు ప్లస్ అయింది.గ్రాండ్ ఫినాలేకు చిరంజీవితో పాటు ముగ్గురు హీరోయిన్లు రానున్నారని మెహరీన్, లక్ష్మీరాయ్, బిగ్ బాస్ కంటెస్టెంట్ మోనాల్ గజ్జర్ షోలో డ్యాన్సులరో సందడి చేయనున్నారని సమాచారం.చిరంజీవి గెస్ట్ గా హాజరైన సీజన్ 3 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కు రికార్డు స్థాయిలో టీఆర్పీ రేటింగ్ వచ్చింది.
బిగ్ బాస్ సీజన్ 4 గ్రాండ్ ఫినాలేకు కూడా భారీగా రేటింగ్ వస్తుందని నిర్వాహకులు ఆశిస్తున్నారు.బిగ్ బాస్ సీజన్ 4 లాంఛింగ్ ఎపిసోడ్ కు 18.5 టీఆర్పీ రేటింగ్ రాగా గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కు అంతకంటే ఎక్కువ టీఆర్పీ రేటింగ్ వస్తుందని బిగ్ బాస్ నిర్వాహకులు భావిస్తున్నారు.మరో రెండు రోజుల్లో బిగ్ బాస్ షో విన్నర్ ఎవరో తేలిపోనుండగా బిగ్ బాస్ షోను మిస్ అవుతామంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.