ఐదు సక్సెస్ ఫుల్ సీజన్లు పూర్తి చేసుకున్న తెలుగు బిగ్ బాస్ ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తుంది.బిగ్ బాస్ ఓటీటీ చివరు వారానికి చేరుకుంది.17 మంది కంటెస్టంట్స్ తో మొదలైన బిగ్ బాస్ ఓటీటీ ఒక వైడ్ కార్డ్ ఎంట్రీతో 18 మందితో బిగ్ బాస్ ఓటీటీ నడిచింది.ప్రస్తుతం హౌజ్ లో ఏడుగురు హౌజ్ మెట్స్ ఉండగా ఈ వారం మధ్యలోనే ఒకరు హౌజ్ నుండి ఎలిమినేట్ అవుతారని తెలుస్తుంది.
ఇక ఆరుగురు హౌజ్ మెంట్స్ ఫైనల్స్ కు చేరుకుంటారు.వారిలో ఇద్దరు టాప్ 2 గా నిలుస్తారు.వారిలో ఒకరు టైటిల్ విజేత అవుతారు.
అయితే ప్రస్తుతం హౌజ్ లో ఉన్న అరియానా, అనీల్, మిత్ర, బిందు, బాబా భాస్కర్, శివ, బిందు మాధవి లలో ఒకరు ఈ వారం మధ్యలో హౌజ్ నుండి బయటకు వచ్చేస్తారని తెలుస్తుంది.
ఇక ఆడియెన్స్ ఓటింగ్స్ ప్రకారం ఈ ఆరుగురిలో ఇద్దరి మధ్య టైటిల్ పోరు నడుస్తుందని అర్ధమవుతుంది. అఖిల్ వర్సెస్ బిందు మాధవి వీళ్లిద్దరిలో ఒకరు బిగ్ బాస్ ఓటీటీ టైటిల్ విజేత అవుతారని అంటున్నారు.
అఖిల్ ఆల్రెడీ బిగ్ బాస్ సీజన్ 4లో టాప్ 2 గా నిలిచాడు.ఇక బిగ్ బాస్ ఓటీటీ లో టైటిల్ అందుకుంటాడా లేదా అన్నది చూడాలి.
బిందు మాధవి కూడా తన మార్క్ ఆట ఆడుతూ అందరికి టఫ్ ఫైట్ ఇస్తుంది.ఫైనల్ గా బిందు, అఖిల్ మధ్యలో ఒకరు టైటిల్ విన్నర్ అవుతారని చెప్పుకుంటున్నారు.