తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ తాజాగా ముగిసింది.బిగ్ బాస్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా బిగ్ బాస్ విజేత గా ఒక మహిళ కంటెస్టెంట్ గెలిచింది.
అయితే తాజాగా జరిగిన గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ మాత్రం రసవత్తరంగా సాగింది.బిగ్ బాస్ హౌస్ లో బాబా భాస్కర్ మాస్టర్ ప్రయాణం ముగిసింది.
టాప్ సెవెన్ కంటెస్టెంట్స్ లలో అనిల్ రాథోడ్ ఎలిమినేట్ కాగా, సత్యదేవ్ చేతులమీదుగా భాస్కర్ కూడా ఎలిమినేట్ అయి బయటకు వచ్చేశాడు.
బాబా భాస్కర్ ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ స్టేజి పైకి రాగానే ఆయన భార్య రేవతికి దండం పెట్టేశాడు.
అది గమనించిన నాగార్జున బలే కవర్ చేస్తున్నావ్ కదా అన్నట్టుగా బాబా భాస్కర్ పై సెటైర్ వేసాడు.ఆ తర్వాత బాబా భాస్కర్ బిగ్ బాస్ హౌస్ లో తన జర్నీ గురించి వివరించాడు.
ఇకపోతే బాబా భాస్కర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన బాబా భాస్కర్ గారు టాప్ 6 ప్లేస్ లో నిలిచాడు.
ఈ సందర్భంగా పేజి పైన బాబా భాస్కర్ మాట్లాడుతూ.
ఈ సీజన్ కంటే ముందుగా వచ్చిన సీజన్ అనుభవమే బాగుంది ఎందుకంటె అప్పుడు మాకేం తెలియదు.కానీ ఈ సీజన్కు వచ్చే సరికి అంత ఎగ్జైట్మెంట్ లేదు.బిగ్బాస్ గురించి అంతా తెలుసు కాబట్టి అలా అనిపించలేదు.
అయినా ఈ షోకు రావడం చాలా ఆనందగా ఉంది.సీక్రెట్ రూమ్లో ఉండటం, ఎవిక్షన్ పాస్ రావడం అన్ని కూడా చాలా బాగున్నాయి.
కానీ శ్రీకాంత్ లోపలకు వస్తాడేమో, డబ్బులు పట్టుకుని పోదామనుకున్నా.కానీ అలా జరగలేదు.
అదొక్క అసంతృప్తి మాత్రమే ఉంది.తర్వాత విన్నర్ ఎవరు అవుతారని నాగార్జున అడగ్గా, ముందుగా బిందు అని సమాధానం ఇచ్చాడు బాబా మాస్టర్.
తర్వాత మళ్లీ శివ, అఖిల్ పేర్లు చెప్పాడు.ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు కావాలని అన్నట్లుగా చెప్పుకొచ్చాడు బాబా భాస్కర్.