బిగ్ బాస్ నాన్ స్టాప్ షోలో తాజాగా జరిగిన ఎలిమినేషన్ ప్రక్రియలో హౌస్ నుంచి కంటెస్టెంట్ అజయ్ ఎలిమినేట్ అయ్యాడు.ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ నుంచి ఏడుగురు కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.
తాజాగా బిగ్ బాస్ హౌస్ నుంచి ఎనిమిదవ కంటెస్టెంట్ అజయ్ కూడా ఎలిమినేట్ అయ్యాడు.ఇక అజయ్ ఎలిమినేట్ అని తెలియడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.
అషు రెడ్డి అయితే కుప్పకూలిపోయి కుమిలి కుమిలి ఏడ్చేసింది.బాధతో అజయ్ దగ్గరికి వెళ్లి ఎమోషనల్ అయ్యింది.
ఇది నేను తట్టుకోలేకపోతున్నాను మిస్ యు అంటూ ఎమోషనల్ అయ్యింది అషు.
ఆ తర్వాత ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ స్టేజ్ మీదకు వచ్చిన అజయ్ హాట్ ఫుల్ సింబల్ బ్రోక్ హార్ట్ సింబల్ ఇచ్చాడు.అనంతరం బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో భాగంగా హౌస్ లోని కంటెస్టెంట్ ల గురించి పలు విషయాలు చెప్పాడు అజయ్.ఈ క్రమంలోనే అఖిల్, అషు, నట్రాజ్ మాస్టర్, బిందు మాధవి, మిత్ర శర్మలకు ఫుల్ హార్ట్ సింబల్ ఇచ్చి మిగిలిన వారికి బ్రోక్ హార్ట్ ఇచ్చాడు.
అఖిల్ కి ఫుల్ హార్ట్ ఇచ్చిన అజయ్ మాట్లాడుతూ.స్ట్రాంగ్ గా ఉండు.అషుని బాగా చూసుకో.అది కొంచం పిచ్చిది అని తెలిపాడు అజయ్.
అనంతరం అషు గురించి మాట్లాడుతూ.మేం ఇద్దరం ఎలా కలుసుకున్నాము కూడా తెలియదు.ఎక్స్ట్రార్డినరీ పీస్.అఖిల్ అంటావు కానీ నువ్వే ఎక్కువ అలుగుతావు.బ్రెయిన్ ఎలాగో లేదు హార్ట్ అయిన వాడు.డైలీ స్నానం చెయ్ నేను భరించాను కానీ మిగిలిన వాళ్ళు భరించలేరు అంటూ కాసేపు ఆటపట్టించాడు అజయ్.
అనంతరం నట్రాజ్ మాస్టర్ గురించి చెబుతూ.ప్రేమ కోపం రెండు ఒకేలా ఉంటాయి అని తెలిపాడు.
ఇక మిత్రశర్మ ఎప్పుడు అజయ్ గారు అని పిలుస్తూ ఉంటుంది.నేను ఏమన్నా కూడా ఆమె పాజిటివ్ గానే తీసుకుంటుంది అని తెలిపాడు అజయ్.
ఇకపోతే మొదట 17 మంది కంటెస్టెంట్ లతో మొదలైన బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం ఎనిమిది మంది కంటెస్టెంట్ లు మాత్రమే మిగిలారు.