బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో విజయవంతంగా 9 వారాలు పూర్తి చేసుకుని పదవ వారంలో అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే.అయితే ఈ సీజన్ లో బిగ్ బాస్ అనేక విషయాల్లో విమర్శలను మూటగట్టుకుంది.
బిగ్ బాస్ నిర్వహకులు కొందరు కంటెస్టెంట్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని కంటెస్టెంట్లే ప్రతి వారం ఎలిమినేట్ అవుతుండగా ఏ మాత్రం పరిచయం లేని కంటెస్టెంట్లే సేఫ్ అవుతూ ఉండటం గమనార్హం.
దీంతో బిగ్ బాస్ షో రేటింగులు సైతం క్రమంగా తగ్గుతున్నాయి.ఈ మధ్య కాలంలో సమంత హోస్ట్ చేసిన దసరా ఎపిసోడ్ మినహా మిగిలిన బిగ్ బాస్ షో ఎపిసోడ్లు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు.
అటు వీక్ డేస్ లోనూ, ఇటు వీకెండ్ లోనూ బిగ్ బాస్ షో రేటింగులు సాధారణ సీరియళ్ల స్థాయిలో ఉన్నాయి.మరోవైపు ఈ సీజన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు సైతం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోవడం గమనార్హం.
దీంతో ఇప్పటికే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లలో ముగ్గురు కంటెస్టెంట్లను హౌస్ లోకి ప్రవేశపెట్టాలని బిగ్ బాస్ నిర్వాహకులు భావిస్తున్నట్టు తెలుస్తోంది.ప్రేక్షకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఎలిమినేట్ అయిన వాళ్లలో ముగ్గురిని హౌస్ లోకి పంపనున్నారని సమాచారం.
తెలుస్తున్న సమాచారం ప్రకారం హౌస్ లోకి దేవి నాగవల్లి, కుమార్ సాయి, దివి రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఈ ముగ్గురికీ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో పాటు వీళ్ల ఎలిమినేషన్ పై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ముగ్గురి రీఎంట్రీ ద్వారా రేటింగ్ లను పెంచుకోవచ్చని నిర్వహకులు భావిస్తున్నారు.
వీళ్లు బిగ్ బాస్ హౌస్ లోకి ఎప్పుడు రీఎంట్రీ ఇస్తారో చూడాల్సి ఉంది.వీళ్ల రీఎంట్రీ గురించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.