బిగ్ బాస్ షో ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న కంటెస్టెంట్లలో మెహబూబ్ ఒకరనే సంగతి తెలిసిందే.మెహబూబ్ కు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
షార్ట్ ఫిల్మ్స్, ఆల్బమ్ సాంగ్స్ ద్వారా మెహబూబ్ పాపులారిటీ మరింత పెరిగింది.యూట్యూబ్ వీడియోలు కూడా మెహబూబ్ ను అభిమానించే అభిమానులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.
తాజాగా ఇన్స్టాగ్రామ్ పేజీలో మెహబూబ్ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
తాజాగా మెహబూబ్ తల్లి మృతి చెందగా మెహబూబ్ తన పోస్ట్ ద్వారా బాధను వ్యక్తం చేశారు.
అమ్మా.నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయావ్ అంటూ మెహబూబ్ పేర్కొన్నారు.
ఇప్పటినుంచి నేను ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలని మెహబూబ్ ప్రశ్నించారు.ప్రతిరోజూ నేను ఎవరితో మాట్లాడాలని మెహబూబ్ కామెంట్ చేశారు.
అసలు నువ్వు లేకుండా నేను ఎలా బ్రతకాలో అర్థం కావడం లేదని మెహబూబ్ చెప్పుకొచ్చారు.నా ప్రతి ప్రయాణంలో నువ్వు తోడుగా ఉన్నావని మెహబూబ్ చెప్పుకొచ్చారు.
నా ఎదుగుదలను చూసి నువ్వు ఆనందించావని మెహబూబ్ కామెంట్ చేశారు.ఇప్పుడు నువ్వు లేకపోతే మా జీవితాలు ఎటు వెళతాయో కూడా అర్థం కాని పరిస్థితి అని మెహబూబ్ చెప్పుకొచ్చారు.నేను ప్రతి క్షణం నిన్ను మిస్ అవుతూనే ఉంటానని మెహబూబ్ కామెంట్లు చేశారు.నాకు అసలు లైఫ్ అంటే ఏంటో నేర్పించావని నువ్వు ఎక్కడున్నా నన్ను చూస్తూనే ఉంటావని నీ ఆశీర్వాదాలు అందిస్తావని నాకు తెలుసని మెహబూబ్ అన్నారు.
ఇకనుంచి తల్లిని మరింత గర్వపడేలా చేస్తానని తమ్ముడిని, డాడీని బాగా చూసుకుంటానని నీకు మాట ఇస్తున్నానని మెహబూబ్ చెప్పుకొచ్చారు.నా హృదయంలో అమ్మ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని మెహబూబ్ కామెంట్లు చేశారు.
ఇలాంటి కష్ట సమయాల్లో మెహబూబ్ స్ట్రాంగ్ గా ఉండాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.