తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన శ్రీముఖి ప్రస్తుతం బిగ్బాస్లో అలరిస్తున్న విషయం తెల్సిందే.యాంకర్గా చాలా బిజీగా ఉన్నా కూడా బిగ్బాస్పై ఆసక్తితో ఆమె సీజన్ 3లో కంటెస్టెంట్గా పాల్గొంటుంది.
అయితే మొదటి నుండి కూడా ఆమెపై సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.శ్రీముఖికి బిగ్బాస్ టీం కావాలని ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఇతర సభ్యులతో పోల్చితే ఆమెకు ఎక్కువ స్క్రీన్ స్పేస్ దక్కింది, దక్కుతుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.
షోలో ప్రతి ఒక్కరు కూడా సమానంగా టీం చూడాల్సి ఉంటుంది.
కాని బిగ్బాస్ టీం మాత్రం శ్రీముఖికి ప్రత్యేకమైన అధికారలు ఇచ్చినట్లుగా ఉందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.అదే విషయాన్ని ఇప్పుడు ఇటీవల ఇంటి నుండి బయటకు వచ్చిన హిమజ కూడా చెప్పుకొచ్చింది.
ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా శ్రీముఖికి బిగ్బాస్ టీం హెల్ప్ చేస్తున్నారనే అనుమానం ఉంది.ఎందుకంటే ఇంట్లో అందరి ముందే ఒకానొక సమయంలో షో డైరెక్టర్స్ నాకు చాలా క్లోజ్ అని చెప్పింది.
వారిద్దరు కూడా నాకు సన్నిహితంగా ఉండే వారు అంటూ ఇంటి సభ్యులందరి ముందు కూడా చెప్పింది.
ఆమె ఆ మాట చెప్పడం వెనుక కారణం తనకు అంతా భయపడాలి.నేను అనుకున్నట్లుగా అంతా సాగాలని.ఎలిమినేషన్ తర్వాత నూతన్ నాయుడుకు ఇంటర్వ్యూ ఇచ్చిన హిమజ పలు సంచలన ఆరోపణలు చేసింది.
శ్రీముఖి విషయంలో ప్రతి ఒక్కరు కూడా చేస్తున్న విమర్శలు నిజమేనేమో అంది.ఏదైనా టాస్క్ ఇంట్రెస్ట్గా లేకుంటే వెంటనే కెమెరా ముందుకు వెళ్లి ఇది అంత ఆసక్తిగా లేదు.
మీరు మరేదైనా ప్లాన్ చేయండి అంటూ సలహాలు ఇస్తుందని ఆ విషయం నేను చూశానంటూ హిమజ చెప్పింది.శ్రీముఖిని ఎక్కువగా పాజిటివ్ వేలో మాత్రమే చూపిస్తున్నారంటూ కూడా ఆమె కామెంట్స్ చేసింది.