మై విలేజ్ షో అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలకు పరిచయమైంది గంగవ్వ.ఈ యూట్యూబ్ ఛానల్ కు 18.5 లక్షల సబ్ స్క్రైబర్లు ఉన్నారంటే గంగవ్వ అందించే ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తుందో సులభంగానే అర్థమవుతుంది.గత సీజన్లలో 50 ఏళ్ల లోపు వయస్సు వాళ్లకు మాత్రమే బిగ్ బాస్ అవకాశం ఇవ్వగా ఈ సీజన్ లో మాత్రం భిన్నంగా 60 ఏళ్ల గంగవ్వకు అవకాశం ఇచ్చారు.
ఇల్లు కట్టుకోవాలనే కోరిక ఉన్న గంగవ్వ బిగ్ బాస్ షోలో పాల్గొంటే ఆ కోరిక నెరవేరుతుందని భావించి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టింది.అయితే బిగ్ బాస్ హౌస్ లో తరచూ అనారోగ్యం పాలు కావడం, ఇంటి బెంగ, ఇతర కారణాల వల్ల గంగవ్వ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చింది.
బయటకు వచ్చిన గంగవ్వ బిగ్ బాస్ 4 బజ్లో భాగంగా రాహుల్ సిప్లిగ్ంజ్ చేస్తున్న ఇంటర్వ్యూకు హాజరై బిగ్ బాస్ హౌస్ లోని కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
బిగ్ బాస్ హౌస్ లో గంగవ్వతో సన్నిహితంగా ఉంటే తాము ఎలిమినేషన్ కు నామినేట్ అయినా ప్రేక్షకులు సేవ్ చేస్తారని భావించి చాలామంది కంటెస్టెంట్లు సేఫ్ గేమ్ ఆడారు.వారి గురించి గంగవ్వ మాట్లాడుతూ బిగ్ బాస్ హౌస్ లో అందరితో పోలిస్తే కుమార్ సాయి నిజాయితీగా గేమ్ ఆడాడని అన్నారు.బిగ్ బాస్ హౌస్ లో హారిక వేస్ట్ అని.హారికకు హౌస్ లో ఉండే అర్హత ఏ మాత్రం లేదని.ఎప్పుడూ కోపంగా తన లోకం తనదే అనే విధంగా ఉంటుందని చెప్పారు.
తనకు హౌస్ లో అఖిల్ తో ఉండటం ఇష్టమని అయితే అంత మాత్రాన అఖిల్ మంచోడని చెప్పలేనంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.హౌస్ లో అఖిల్ మోనాల్ జంట బాగుంటుందని.
అవినాష్ ఎక్కువగా నవ్విస్తాడని అన్నారు.తాను బిగ్ బాస్ హౌస్ లో అయినా బయట అయినా ఉన్నది ఉన్నట్లుగా చెబుతానని గంగవ్వ తెలిపారు.