బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా ఒక్కసారిగా ఫేమ్ లోకి వచ్చిన నటి దివి వైద్య.తెలుగమ్మాయి అయిన ఈ అమ్మడు హీరోయిన్ కావాలనే డ్రీమ్ తో ప్రయత్నాలు చేస్తూ షార్ట్ ఫిలిమ్స్ నుంచి మోడలింగ్ లోకి అడుగుపెట్టి అదే సమయంలో ఏకంగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో పాల్గొనే అవకాశం దివి సొంతం అయ్యింది.
ఈ షో ద్వారా ఆమె అందానికి కావాల్సినంత పాపులారిటీ లభించింది.ఇక షో కంప్లీట్ అయిన తర్వాత కూడా చిన్న సినిమాలలో హీరోయిన్ గా అవకాశాలు వచ్చాయి.
తాజాగా క్యాబ్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ తో ఈ బ్యూటీ ప్రేక్షకుల ముందుకి వచ్చింది.ఇదిలా ఉంటే బిగ్ బాస్ ఫైనల్ సమయంలో మెగాస్టార్ చిరంజీవి దివినికి తన వేదాళం మూవీ రీమేక్ లో అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించడం ద్వారా ఒక్కసారిగా పాపులారిటీ అమాంతం పెరిగిపోయింది.
ఈ పాపులారిటీతో టెలివిజన్ షోలలో కూడా ఈ బ్యూటీకి అవకాశాలు వస్తున్నాయి.అలాగే ఓ మూడు సినిమాల వరకు హీరోయిన్ గా కమిట్ అయినట్లు తెలుస్తుంది.తెలుగమ్మాయి అయిన గ్లామర్ షోకి ఏ మాత్రం వెనుకాడని దివి వైద్య వరుస ఫోటోషూట్ లతో సోషల్ మీడియాలో తన ఫాలోయింగ్ కూడా పెంచుకుంటుంది.ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ ఓ అరుదైన ఘనతని సొంతం చేసుకుంది.2020లో టీవీ పరిశ్రమకి చెందిన మోస్ట్ డిజైరబుల్ విమెన్ గా గౌరవం దక్కించుకుంది.హైదరాబాద్ టైమ్స్ నిర్వహించిన సర్వేలో నెటిజన్లు దివికి ఎక్కువగా ఓట్లు వేసి ఆమెని ఫస్ట్ ప్లేస్ లో కూర్చోబెట్టారు.
ఇక ఈమెతో పోటీ పడిన శ్రీముఖి, విష్ణుప్రియ, అనసూయలాంటి యాంకర్స్ ని బీట్ చేసుకొని దివి వైద్య టెలివిజన్ లో ఎలాంటి షోలు చేయకుండానే ఈ గుర్తింపుని దక్కించుకుంది అంటే బిగ్ బాస్ ఆమెని ఎంత పెద్ద సెలబ్రిటీని చేసిందో అర్ధం చేసుకోవచ్చు.