మోడల్ గా తన కెరీర్ ని మొదలు పెట్టి, తెలుగులో మహేష్ బాబు హీరోగా నటించిన మహర్షి సినిమాతో చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన నటి దివి.2017 లో ఒక మోస్ట్ పాపులర్ మోడల్ గా ఎదిగి ఎన్నో రాంప్ షోస్ లో పాల్గొన్నారు దివి.ఆ తర్వాత వివిధ సినిమాల్లోనూ వివిధ పాత్రల్లో నటించి మరో మెట్టుకి ఎదిగారు.అంతే కాకుండా తెలుగులో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 4 లోనూ అవకాశం దక్కించుకొని తెలుగు బుల్లితెర ప్రేక్షకులను సైతం దివి మెప్పించారు.
ఇలా బిగ్ బాస్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ బ్యూటీ నిత్యం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామరస్ ఫోటోలను కూడా షేర్ చేస్తూ అభిమానులను సందడి చేసేవారు.ఈ విధంగా బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన అనంతరం దివికి చాలా ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి.
ఇంతకుముందు ఉన్న పాపులారిటీ కంటే ఇప్పుడు ఆమెకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు.తన నటనతో, అదిరిపోయే డాన్స్ స్టెప్పులతో కుర్రకారును ఉర్రూతలూగిస్తున్నారు.
సోషల్ మీడియాలో కూడా ఈ బ్యూటీకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు.
ఇదిలా ఉండగా తాను ఇండస్ట్రీకి వచ్చినపుడు తన రెమ్యునరేషన్ 5 నుంచి 8 వేలుగా ఉండేదని ఆమె చెప్పారు.
కానీ ఇప్పుడు మాత్రం అంత కంటే భారీ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటున్నానని దివి తెలిపారు.అంతే కాకుండా ఆమె ప్రస్తుతం తన తల్లిదండ్రులు ఒకప్పుడు ఒకరోజుకి ఎంత సంపాందించే వారో, ఇప్పుడు తాను ఒకరోజుకు సంపాదిస్తున్నానని ఆమె అన్నారు.
అంతే కాకుండా తన తల్లిదండ్రులు తనకు చాలా స్వేచ్ఛ ఇచ్చారని దాన్ని తాను ఎప్పటికీ నిలుపుకుంటానని అన్నారు.అందరి పేరెంట్స్ కూడా అలా తమ పిల్లలను అదే విధంగా తమను అర్దం చేసుకోవాలని, అప్పుడే తాము అనుకున్నది చేయగలుగతామని ఓ ఇంటర్వ్యూ సందర్భంగా దివి తెలియజేశారు.