తెలుగు చలన చిత్ర పరిశ్రమలో బుల్లి తెరపై తమ నటనా ప్రతిభను నిరూపించుకునే వెండి తెరపై హీరో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి బాగానే అలరించినా సీరియల్ హీరోలు మరియు హీరోయిన్లు సినీ పరిశ్రమలో చాలా మందే ఉన్నారు.కాగా ఈ క్రమంలో ఆ మధ్య ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి జెమినీ టీవీలో ప్రసారమయ్యే మొగలిరేకులు, చక్రవాకం తదితర ధారావాహికలలో హీరోగా నటించి సినీ ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన ప్రముఖ హీరో సాగర్ ప్రస్తుతం వరుస సినిమాల్లో హీరోగా నటిస్తూ దూసుకుపోతున్నాడు.
అలాగే చి.ల.సౌ స్రవంతి, రామ చక్కని సీత మరియు మరిన్ని చిత్రాల్లో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించిన తెలుగు ప్రముఖ సీరియల్ నటుడు నంద కిషోర్ కూడా ఇటీవలే హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు.అయితే ఇదే బాటలో ఇటీవలే ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి జీ తెలుగు లో ప్రసారమయ్యే కల్యాణ వైభోగమే అనే ధారావాహికలో హీరోగా నటిస్తున్న వీజే సన్నీ కూడా హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించకోబోతున్నాడు.
కాగా ప్రస్తుతం వీజే సన్నీ “సకల గుణాభి రామ” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు ఈ చిత్రంలో హీరోయిన్లుగా నూతన హీరోయిన్లు అసిమా నర్వాల్, తరుణిక సింగ్, నటిస్తుండగా ప్రముఖ కమెడియన్ చమ్మక్ చంద్ర, ఫన్ బకెట్ మహేష్ విట్టా, సరయు, సింగ్ద తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు కాగా ఈ చిత్రానికి నూతన దర్శకుడు వెలిగొండ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తుండగా నూతన నిర్మాత సంజీవరెడ్డి ఈఐపీఎల్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు.అయితే మంచి ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల కాగా మంచి స్పందన లభించింది.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం వీజే అయినటువంటి మా టీవీలో ప్రసారమయ్యే బిగ్ బాస్ రియాల్టీ షో ఐదవ సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొంటూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు.అంతేకాకుండా జీ తెలుగులో ప్రసారం అవుతున్న “కల్యాణ వైభోగమే” అనే ధారావాహికలో కూడా నటిస్తూ భాగానే అలరిస్తున్నాడు.సీరియల్స్ లో తన ఎమోషనల్ నటనతో ఆకట్టుకున్న నా దేశాన్ని వెండితెరపై ప్రేక్షకులను ఎలా అలరిస్తాడో చూడాలి.