బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో నుంచి 12వ వారం రవి ఎలిమినేట్ కాగా రవి ఎలిమినేషన్ ను అభిమానులు ఇప్పటికీ నమ్మలేకపోతున్నారు.రవి ఎలిమినేషన్ వల్ల ఆయన అభిమానులు తీవ్రస్థాయిలో నిరాశకు గురి కావడంతో పాటు రవికి ఎన్ని ఓట్లు వచ్చాయో వెల్లడించాలని కోరారు.
రవి టాప్ 5లో ఉండాల్సిన కంటెస్టెంట్ అని అలాంటి కంటెస్టెంట్ ను ఎలిమినేట్ చేయడం వల్ల బిగ్ బాస్ షోపై ఆసక్తి తగ్గిందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
అయితే తాజాగా రవి తల్లి బిగ్ బాస్ షో గురించి షాకింగ్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
రవి బిగ్ బాస్ హౌస్ లోకి రీఎంట్రీ ఇస్తాడంటూ జరిగిన ప్రచారంలో కూడా నిజం లేదని తేలిన నేపథ్యంలో రవి అభిమానులు ఫీలవుతున్నారు.రవి తల్లి రవి ఎలిమినేషన్ గురించి అసహనం వ్యక్తం చేశారు.
రవి తల్లి ఉమారాణి రవి ఎలిమినేట్ కావడంతో ఫ్రెషర్ కుక్కర్ నుంచి బయటపడినట్టు అనిపించిందని తెలిపారు.
రవిని ఎన్ కౌంటర్ చేసినట్టు అనిపిస్తోందని ఆమె తెలిపారు.టాప్ 5లో ఉండాల్సిన తన కొడుకు ఎలిమినేట్ కావడం ఆశ్చర్యంగా ఉందని రవి తల్లి చెప్పుకొచ్చారు.రవి బిగ్ బాస్ గేమ్ ఆడాడని పిచ్చి చేష్టలు చేసి హౌస్ నుంచి రాలేదని ఊరికే కూర్చుని తిని రాలేదని తన కొడుకు గేమర్ అని ఉమారాణి వెల్లడించారు.
రవి తెలివిగా ఆడాడని ఆమె చెప్పుకొచ్చారు.బిగ్ బాస్ కు మంచివాళ్లు, ఆట ఆడేవాళ్లు అవసరం లేదని అర్థమైందని ఉమాదేవి వెల్లడించారు.
బిగ్ బాస్ షోకు కావాలని రవిని తీసుకెళ్లారని కానీ ఆ హోదా ఇవ్వలేదని ఆమె కామెంట్లు చేశారు.బిగ్ బాస్ వాళ్లు రెస్పెక్ట్ ఇవ్వలేకపోయినా ఫ్యాన్స్ రెస్పెక్ట్ ఇస్తున్నారని ఉమారాణి చెప్పుకొచ్చారు.సెలబ్రిటీలను మేకలు, గొర్రెలలా ఉంచారని కాన్సెప్ట్ మార్చకపోతే బిగ్ బాస్ చూడరని ఇండస్ట్రీలో ఉంటూ ఇండస్ట్రీకి చెందిన వాళ్లనే అవమానిస్తున్నారని ఉమారాణి వెల్లడించారు.