బిగ్ బాస్ కంటెస్టెంట్ ప్రియా గురించి మనకు తెలిసిందే.ఈమె వెండితెరపై పలు సినిమాలలో నటించింది.
అలాగే బుల్లితెరపై కూడా ఎన్నో సీరియల్స్ లో నటించి ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకుంది.ఇక ఇటీవలే ప్రియా బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళిన విషయం అందరికి తెలిసిందే.
హౌస్ లో తన గేమ్, టాస్క్ లతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ వచ్చింది.కెప్టెన్సీ కాలేరని తెలిసినప్పటికీ చిరునవ్వుతో ఆ నిర్ణయాన్ని స్వాగతించి ఎంతోమంది మనసులను సంపాదించుకుంది.
ఎట్టకేలకు అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేసుకుని ఐదో వారం కెప్టెన్ అయ్యింది ప్రియ.కానీ బిగ్ బాస్ హౌస్ లో టాస్క్ లో సన్నీ ని రెచ్చగొట్టడం, అతని చెంప పలగొడతా అనడంతో సోషల్ మీడియాలో ఆమె పై పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేశారు.
ఫలితంగా ఆమె ఓట్లు తగ్గి ఏడో వారం షో నుంచి ఎలిమినేట్ అయింది.ఇది ఇలా ఉంటే తాజాగా మా ఇంట్లో జరిగిన ఒక వేడుకకు బిగ్ బాస్ కంటెస్టెంట్ లు హాజరయ్యారు.
నవంబర్ 21న ప్రియకు వరుస అయ్యే కూతురు లోహిత పెళ్లి జరిగింది.ఈ వివాహ వేడుకకు బిగ్ బాస్ కంటెస్టెంట్ లు జెస్సి, ఉమాదేవి, సరయు హాజరయ్యారు.ఈ పెళ్లి వేడుకలో వీరు దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కాగా ఇటీవలే మా ఇంట్లో పెళ్లి వేడుకలు షురూ అంటూ ఇంటి ముందు ముగ్గులు వేసిన ఫోటోను ప్రియా ఈ మధ్యన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన విషయం తెలిసిందే.
ఆ తరువాత జరిగిన హల్ది,మెహందీ వేడుకలకు సంబంధించిన ఫోటోలను సైతం ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంది.