బిగ్ బాస్ షో రెండో సీజన్ లో పాల్గొన్న నూతన్ నాయుడుకు సంబంధించి ఎన్నో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే.బిగ్ బాస్ షోలోకి సామాన్యుడిగా ఎంట్రీ ఇచ్చిన నూతన్ నాయుడిపై అప్పట్లోనే విమర్శలు చెలరేగాయి.
ఆయన ఒక రాజకీయ పార్టీకి చెందినవాడని, బిగ్ బాస్ నిర్వాహకులకు ఎదురు డబ్బులు కట్టి షోలోకి వెళ్లాడని వార్తలు వచ్చాయి.ఆ తర్వాత కొంతకాలం సైలెంట్ అయిన నూతన్ నాయుడు కొన్ని రోజుల క్రితం పరాన్నజీవి సినిమాతో వార్తల్లో నిలిచాడు.
రామ్ గోపాల్ వర్మ పవర్ స్టార్ పేరుతో సినిమా తెరక్కెక్కించడంతో ఆర్జీవీని విమర్శిస్తూ నూతన్ నాయుడు పరాన్నజీవి సినిమాను షకలక శంకర్ హీరోగా పెట్టి తెరకెక్కించాడు.శ్రేయాస్ మీడియా యాప్ లో విడుదలైన ఈ సినిమా ఎప్పుడొచ్చిందో ఎప్పుడు పోయిందో కూడా తెలీదు.
ఆ తర్వాత శిరోముండనం కేసు నూతన్ నాయుడును వార్తల్లో నిలిపింది.సెల్ ఫోన్ దొంగతనం చేశాడనే ఆరోపణలతో నూతన్ నాయుడు భార్య మధుప్రియ దళిత యువకుడు శ్రీకాంత్ కు శిరోముండనం చేయించింది.
అయితే నూతన్ నాయుడుకు తెలిసే ఇదంతా జరిగిందని తేలడంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.అయితే అరెస్ట్ చేసిన తరువాత నూతన్ నాయుడు ప్రభుత్వ రంగ బ్యాంక్ డైరెక్టర్ పదవి ఇప్పిస్తామని చెప్పి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారికి ఏకంగా 12 కోట్లు టోకరా వేశాడని విశాఖ పోలీసులకు మరో ఫిర్యాదు అందింది.
అయితే పోలీసులు ఈ కేసులో కస్టడీలోకి తీసుకునే ముందు అతని నివాసంలోనే విచారణ జరిపారు.
అయితే విచారణ సమయంలో నూతన్ నాయుడు కొత్త డ్రామాకు తెర లేపాడు.
కడుపులో నొప్పిగా ఉందని కడుపు నొప్పి తగ్గే వరకు కస్టడీలోకి తీసుకోవద్దని నూతన్ నాయుడు కోరాడు.అయితే విశాఖ పోలీసులు మాత్రం అవసరమైతే వైద్య సహాయం అందేలా చేస్తామని చెప్పి అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు కస్టడీలోకి తీసుకుంటామని చెప్పిన నూతన్ కడుపునొప్పి అని చెప్పడంపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.