బిగ్ బాస్ సీజన్ 4 ప్రారంభమై మూడు వారలను పూర్తి చేసుకుంది.ఇప్పటికే ఈ సీజన్ లోకి ఎంటర్ అయిన సూర్య కిరణ్, కరాటే కళ్యాణి, టీవీ9 దేవి నాగవల్లి వారానికి ఒకరుగా ఎలిమినేట్ అవుతూ వచ్చారు.
అయితే ఈ షో లో మొదటి రెండు వారాలు కంటస్టెంట్లు అక్క చెల్లెళ్లుగా.అన్నాతమ్ముల్లుగా కలిసున్న వీరు మూడో వారం నుంచి శత్రువులుగా మారారు.
బిగ్ బాస్ హౌస్ లో ఒకరి మధ్య ఒకరికి చిచ్చు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నాడు బిగ్ బాస్.
ఒకవైపు లవ్ స్టోరీలు.
మరోవైపు ఫైట్ స్టోరీలు బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతున్నాయ్.ఇక అలానే నాలుగో వారం బిగ్ బాస్ హౌస్ లో టాస్కు చాలా రసవత్తరంగా జరిగింది.
కిల్లర్ కాయిన్ టాస్క్ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగింది.ఇక నిన్నటి ఎపిసోడ్ లో మెహబూబ్ కెప్టెన్ అవ్వడం కోసం బాగా ప్రయత్నించాడు.
కానీ బిగ్ బాస్ చాలా దారుణమైన దెబ్బ కొట్టాడు.మొన్న ఓ స్వీచ్ కాయిన్ పడగా అది తీసుకొని వేస్ట్ అని విసిరేశాడు మెహబూబ్.
అయితే ఆ కాయిన్ వల్ల చాలా యూజ్ ఉంటుందని.చివరిలో ఎంతో ఉపయోగపడుతుందని బిగ్ బాస్ చెప్పడంతో అప్పుడే మెహబూబ్ తలకొట్టుకున్నాడు.ఆ కాయిన్ కాస్త సుజాత తీసుకొని టాస్కు మొత్తం తెలివిగా దాచిపెట్టుకుంది.ఇక అది పోతే పోనిలే కాయిన్స్ అయినా సంపాదించి కెప్టెన్ అవుదాం అనుకున్న మెహబూబ్ కాంటస్టెంట్స్ కి తెలియకుండా వారు నిద్రపోయిన సమయంలో అక్కడ కొందరివి.
ఇక్కడ కొందరివి కాయిన్స్ దొంగతనం చేశాడు.దీంతో మెహబూబ్ పది వేలు సంపాదించాడు.
అయినా ఉపయోగం లేదు.ఎందుకంటే మెహబూబ్ 10 వేలు సంపాదించినది అంత కూడా సుజాత దగ్గర ఉన్న ఒక స్విచ్ కాయిన్ తో పోయే.దీంతో మెహబూబ్ కండబలం ఉపయోగించి కూడా ఉపయోగం లేకుండా పోయింది.అందుకే అంటారు.
కండ బలం కన్నా బుద్ది బలం గొప్పదని.కానీ ఏం చేస్తాం.
కండబలం లేకపోతే చాలు మొగాడు కాదని ఫీల్ అవుతారు బిగ్ బాస్ కంటస్టెంట్లు కొందరు.