తెలుగు బుల్లితెర ప్రసారమవుతున్న ఎన్నో సీరియల్ లో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మానస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.బుల్లితెరపై ఈయనకు ఏర్పడిన క్రేజ్ వల్ల ఇతనికి బిగ్ బాస్ కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశం వచ్చింది.
ఈ క్రమంలోనే ప్రస్తుతం తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా అడుగుపెట్టి కార్యక్రమం మొదటిరోజు నుంచి ప్రతి ఒక టాస్క్ లో ఎంతో అద్భుతంగా ఆడుతూ మంచి పాపులారిటీ దక్కించుకున్న మానస్ ప్రస్తుతం టాప్ ఫైవ్ కంటెస్టెంట్ హౌస్ లో ఉన్నారు.
ఇదిలా ఉండగా మానస్ బిగ్ బాస్ హౌస్ లో వుండగానే ఆయన నటించిన క్షీరసాగర మథనం సినిమా విడుదలైంది.
ఈ క్రమంలోనే ఈ సినిమా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.మానస్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతూ విశేషమైన తెలుగు ప్రేక్షకాదరణ దక్కించుకుంది.
ఇక బిగ్ బాస్ హౌస్ లో ఉన్నటువంటి మానస్ టాప్ ఫైవ్ కంటెస్టెంట్ గా నిలబడటం క్షీరసాగర మథనం సినిమాకు ఒక ప్లస్ పాయింట్ అయిందని ఈ సినిమా కూడా బిగ్ బాస్ హౌస్ లో ఉన్న మానస్ కి ప్లస్ పాయింట్ అయిందనే చెప్పాలి.
ఈ సందర్భంగా క్షీరసాగర మథనం దర్శకుడు అనిల్ పంగులూరి ఈ సందర్భంగా మాట్లాడుతూ మానస్ హీరోగా నటించిన క్షీరసాగర మథనం సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతూ విశేష ప్రేక్షకాదరణ దక్కించుకుంది.ఈ సినిమా పూర్తయిన తర్వాత మానస్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడం వల్ల ఈ కార్యక్రమం ద్వారా అతను మరింత పాపులారిటీ దక్కించుకుని లక్షల్లో అభిమానులని సంపాదించుకున్నారు.ఈ విధమైనటువంటి పాపులారిటీ పెరగడంతో తాను నటించిన క్షీరసాగర మథనం సినిమాను తెలుగు ప్రేక్షకులు విశేషంగా ఆదరిస్తున్నారని ఈ సందర్భంగా దర్శకుడు అనిల్ వెల్లడించారు.
అలాగే తెలుగులో ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న ఈ సినిమాను హిందీ,తమిళం, కన్నడ, మలయాళ భాషలలో తెరకెక్కించాలని భావిస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు.ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్,… అక్షత సోనావని, చరిష్మా శ్రీకర్, ప్రదీప్ రుద్ర వంటి వారు కీలక పాత్రలో నటించారు.ఇకపోతే ప్రస్తుతం మానస్ బిగ్ బాస్ హౌస్ లో టాప్ ఫైవ్ కంటెస్టెంట్ గా కొనసాగుతూ ఉన్నారు.ఈ నేపథ్యంలోనే ఆయన నటించిన సినిమా విజయవంతం కావడంతో బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ఇతనికి మరింత పాపులారిటీ పెరిగే అవకాశం ఉంది.
ఈ కార్యక్రమం ఫినాలే కు ఒక నాలుగు రోజులు మాత్రమే ఉండడంతో ఈ కార్యక్రమంలో ట్రోఫీ ఎవరు అందుకుంటారు అనే విషయం పై తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది.ఈ కార్యక్రమంలో మానస్ ట్రోఫీ అందుకోవాలని మనసారా భావిస్తున్నామని ఈ సందర్భంగా క్షీరసాగర మథనం డైరెక్టర్ అనిల్ పంగులూరి ఆకాంక్షించారు.