తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ నాల్గువ సీజన్ మూడు వారాలు పూర్తి చేసుకుని నాల్గువ వారంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే.ఇప్పటి వరకు మూడు వైల్డ్ కార్డుల ద్వారా కుమార్ సాయి, జబర్దస్త అవినాష్, స్వాతి దీక్షిత్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వగా.
మొదటి వారం సూర్య కిరణ్, రెండో వారం కరాటే కళ్యాణి మరియు మూడో వారం టీవీ 9 దేవి నాగవల్లి ఎలిమినేట్ అయ్యారు.ఇక మొదటి వారంతో పోల్చుకుంటే.
రెండు, మూడు వారాలు కాస్త రంజుగానే నడిచాయి.
అయినప్పటికీ బిగ్ బాస్ క్రేజ్ తగ్గినట్టు తెలుస్తోంది.
రేటింగ్స్ కూడా ఘోరంగా పడిపోయినట్టు సమాచారం.బుల్లితెర బాహుబలిగా ఉన్న కార్తీకదీపం సీరియల్ రేటింగ్ 18 పాయింట్లకు తగ్గకుండా దూసుకుపోతుంటే.
బిగ్ బాస్కు మాత్రం వీక్ డేస్లో 8 పాయింట్లు, వీకెండ్లో 10 పాయింట్లు వస్తున్నట్టు టాక్ నడుస్తోంది.ఈ రేటింగ్ బట్టీ చూస్తే బిగ్ బాస్ క్రేజ్ తగ్గిందనే చెప్పాలి.
ఇందుకు కంటెస్టెంట్స్లో చాలా వరకూ కొత్త ముఖాలు ఉండటం, ఐపీఎల్ 2020 హడావిడి, టాస్క్లలో పస లేకపోవడం కారణాలుగా చెప్పారు.అయితే ఇప్పుడు బిగ్ బాస్ క్రేజ్ తగ్గడానికి మరో కొత్త కారణం తెరపైకి వచ్చింది.అదేంటంటే బిగ్ బాస్ నిర్వాహకులు సీక్రెట్ మెయిన్టెయిన్ చేయలేకపోవడం.ఎందులో అనేగా మీ డౌట్.ఎలిమినేటర్స్ విషయంలో.
అవును! గడిచిన మూడు వారాలు చూసుకుంటే.అదివారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది రెండు, మూడు రోజుల మందే లీక్ అయిపోతుంది.వాస్తవానికి గత మూడు సీజన్లలోనూ ఎలిమినేటర్స్ విషయంలో లీకులు అయ్యాయి.
కానీ అవి కొన్ని గంటల ముందే తెలిసేవి.అయితే బిగ్ బాస్ సీజన్ 4లో మాత్రం రెండు రోజుల ముందే లీకులు అవ్వడంతో.
బుల్లితెర ప్రేక్షకులకు కిక్ లేకుండా పోతుందని.అందుకే షో చూసేందుకు అసహనం వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు.
మరి ఇప్పటికైనా బిగ్ బాస్ నిర్వాహకులు జాగ్రత్త పడతారో.లేదో.
చూడాలి.